వైయస్ జగన్కు మొరపెట్టుకున్న వికలాంగురాలు శ్రీకాకుళంః వైయస్ జగన్ను జ్యోతి అనే వికలాంగురాలు కలిసి తమ గోడు చెప్పుకున్నారు.ఎంబీఏ చదువుకున్నా నిరుద్యోగిగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు.పీహెచ్ కోటాలో కేవలం ఒకటి,రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయన్నారు. వైయస్ఆర్ హయాంలో పెన్షన్ లభించిందని, ప్రస్తుతం పెన్షన్ ఇవ్వడంలేదని వాపోయారు.నియామకాల్లో తమకు ఎక్కువ పోస్టులు కేటాయించాలని వైయస్ జగన్ను కోరారు. నిరుద్యోగ భృతి దరఖాస్తు కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు.వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే మంచి పాలన అందించాలని కోరారు.