<br/>ప్రకాశం: నా పేరు ప్రతిభ. అప్పుచేసి ఎంబీబీఎస్ చదువుతున్నానని, ఫీజు రీయింబర్స్మెంట్ ట్రజరీలో సమస్య ఉండడం వల్ల రావడం లేదని కాలేజీ యాజమాన్యం చెబుతుందని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియట్లో స్కాలర్షిప్ల కోసం గత రెండు సంవత్సరాలుగా దరఖాస్తు చేస్తున్నాను. అయితే ప్రభుత్వం మంజూరు చేయలేదని ప్రతిభ వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందించింది. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ మరో ఏడాది ఆగితే తానే చదివిస్తానని హామీ ఇచ్చారు.