‘యువత పోరు’ గ్రాండ్‌ సక్సెస్‌

పెద్ద ఎత్తున కదలి వచ్చిన యువత, విద్యార్థులు

ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అంతా సిద్ధం

ఎన్నికల హామీలు అమలు చేసేదాకా పోరాటం ఆగదు

జక్కంపూడి రాజా, పానుగంటి చైతన్య స్పష్టీకరణ

తాడేప‌ల్లి: రాష్ట్రంలో నిరుద్యోగ యువత, విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎండగడుతూ, వారి సమస్యలపై వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘యువత పోరు’ కార్యక్రమం అన్ని చోట్లా విజయవంతమైంది. 
పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు తరలి రావడంతో పలు చోట్ల వారిని  పోలీసుల ద్వారా అదుపు చేయాలని ప్రయత్నించారు. దీంతో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
యువత పోరు కార్యక్రమం విజయవంతం అయిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్కే జక్కంపూడి రాజా, తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వారేమన్నారంటే..:
జక్కంపూడి రాజా. వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. మాజీ ఎమ్మెల్యే:

    ఎన్నికల ముందు యువత, విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి, అ«ధికారంలోకి వచ్చి ఏడాది పూరై్తనా, ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. సూపర్‌సిక్స్‌ హామీలన్నీ గాలికి ఎగరగొట్టారు. ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన లేదా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి మాట కూడా నిలబెట్టుకోలేదు. 2014–19 మధ్య చేసినట్లుగానే, ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు అన్ని హామీలు తుంగలో తొక్కి, అన్ని వర్గాలను దగా చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.60 కోట్ల నిరుద్యోగ యువత ఉండగా, వారికి ఏటా రూ.36 వేల చొప్పున ఈ ప్రభుత్వం రూ.57 వేల కోట్లు బకాయి పడింది. 
    కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా, మెగా డీఎస్సీ పేరుతో పచ్చి దగా చేస్తూ, దాన్ని దగా డీఎస్సీగా మార్చారు. మరోవైపు ఏకంగా లక్షల ఉద్యోగాలు పీకేశారు. తాము అధికారంలోకి వస్తే, వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని నమ్మబలికి, గద్దెనెక్కగానే నిర్దాక్షిణ్యంగా 2.4 లక్షల వాలంటీర్లను తొలగించారు. బెవరేజెస్‌ కార్పొరేషన్, ఏపీ ఫైబర్‌గ్రిడ్‌తో పాటు, పలు శాఖలు, విభాగాల్లో వేలాది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తీసేశారు. పౌర సరఫరాల శాఖలో ఎండీయూ వాహనాలు రద్దు చేసి దాదాపు 20 వేల మంది పొట్ట గొట్టారు.
    ప్రభుత్వ తీరును ఎండగడుతూ, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన యువత పోరు కార్యక్రమం విజయవంతం అయ్యింది. 26 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. 

పానుగంటి చైతన్య. వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు:
    పల్నాడులో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న మాపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్‌ చేశారు. రౌడీలను, దోపిడీ దొంగలను తరిమినట్టు మాపై దాడులకు తెగబడ్డారు. నాపై అక్రమ కేసు నమోదు చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడగడమే ఈ ప్రభుత్వానికి నేరంగా కనిపిస్తోంది. అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్, నయవంచనకు అసలు సిసలు అడ్రస్‌ చంద్రబాబు. విద్యార్థులు, యువతను మాయ మాటలతో నమ్మించి చంద్రబాబు నట్టేట ముంచారు. నారా వారి వెన్నుపోటు రాజకీయాలకు ఆంధ్రా యువత మరోసారి దారుణంగా బలైపోయింది. 
    గత ప్రభుత్వంలో జగన్‌గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే, చంద్రబాబు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, లక్షలాది మందిని తొలగించారు. వేలాది మందికి ఉపా«ధి లేకుండా చేసి, వారి పొట్టగొట్టారు. నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది.

Back to Top