పల్నాడు: తాము చూసే సమయానికి సింగయ్య స్వల్ప గాయాలతోనే ఉన్నాడని, ఆ తరువాత ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని వైయస్ఆర్సీపీ దాసరి వీరయ్య, న్యాయవాది కోటేష్ తెలిపారు. సింగయ్య మరణంపై ప్రత్యక్ష సాక్షులు మీడియాకు పలు కీలక వివరాలు వెల్లడించారు. దాసరి వీరయ్య ఏమన్నారంటే..`వైయస్ జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా నేను కూడా కాన్వాయ్ లో వెళ్లాను. మేము చూసే సమయానికి సింగయ్య స్వల్పగాయాలతో ఉన్నాడు. మేము వైయస్ఆర్సీపీ కార్యకర్తలుగా బాధ్యత వహించి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ అక్కడ ఉన్న ఏఎస్ఐ రాజశేఖర్ వద్దని అడ్డుకున్నారు . అంబులెన్స్ లోనే తీసుకెళ్లాలన్నాడు. దాంతో సింగయ్య వివరాలు తీసుకుని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం. అతనికి ఉన్న గాయాలను చూస్తే చనిపోయే అవకాశమే లేదు తలకు కూడా గాయాలు కూడా కాలేదు. కాలర్ బోన్ దగ్గర మాత్రమే చిన్న గాయం అయినట్లు కనిపించింది. సింగయ్య ఎలా చనిపోయాడనే దానిపై అనుమానం ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైనా జరగవచ్చు` అని వీరయ్య అనుమానం వ్యక్తం చేశారు. ఎస్పీ అలా మాట్లాడటం సరికాదు: కోటేష్, న్యాయవాది : సింగయ్య గాయాలతో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నా టూ వీలర్ మీద నుండి పడితే గాయాలయినట్లుగానే అతని శరీరంపై గాయాలు ఉన్నాయి నా కారులో నుంచి గొడుగు తీసి ఆయనకు పెట్టాను సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోను తీసుకుని ఎస్పీ మాట్లాడిన తీరు సరికాదు అంతకుముందు ఇంకో కారు చెప్పి, ఇప్పుడు జగన్ కారు అని చెప్పటం ఏంటి? ఒక బాధ్యత కలగిన ఎస్పీ అలా మాట్లాడటం సరికాదు సింగయ్యకు తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయి ఆ గాయాలతో చనిపోయే పరిస్థితి లేదు దీనిపై మేము లీగల్ గానే తేల్చుకుంటాం