అమరావతి: వైయస్ఆర్ ఎల్పీ సమావేశం ఈ నెల 7వ తేదీన ఉదయం పది గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ శాసనసభాపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. విజయవాడకు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్నునుంచి విమానంలో ఆదివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ శనివారం ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్ తిరిగి విజయవాడ చేరుకున్నారు.