కూడేరు సీఐ రాజు పచ్చ చొక్కా వేసుకుంటే మంచిది 

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఫైర్‌

అనంతపురం: అనంతపురంలోని పోలీసు ‍స్టేషన్‌ను టీడీపీ కార్యాలయంగా మార్చిన కూడేరు సీఐ రాజు ఖాకీ చొక్కా తీసేసి పచ్చ చొక్కా వేసుకుంటే మంచిద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిప‌డ్డారు. టీడీపీ కండువాలు వేసుకుంటేనే ఫిర్యాదు తీసుకుంటానని సీఐ చెప్పటం హేయమైన చర్య అని ధ్వ‌జ‌మెత్తారు. కూడేరు సీఐ తీరును ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి  తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..‘వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై సీఐ రాజు వేధింపులకు పాల్పడుతున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ తొత్తుగా కూడేరు సీఐ రాజు వ్యవహరిస్తున్నారు. టీడీపీ కండువాలు వేసుకుంటేనే ఫిర్యాదు తీసుకుంటానని చెప్పటం హేయమైన చర్య. కూడేరు సీఐ రాజు ఖాకీ చొక్కా తీసేసి పచ్చ చొక్కా వేసుకుంటే మంచిది. మంత్రి పయ్యావుల కేశవ్ వర్గీయులు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు.

ఉరవకొండ నియోజకవర్గంలోని సీఐ, ఎస్‌ఐలకు ముడుపులు ఇస్తున్నారు. మంత్రి పయ్యావుల లంచాలకు అలవాటు పడ్డ సీఐ రాజు.. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూడేరు సీఐ రాజుపై ఎస్పీ, డీఐజీకి ఫిర్యాదు చేస్తాం. కూడేరు సీఐ రాజును వెంటనే సస్పెండ్ చేయాలి’ అంటూ విశ్వేశ్వ‌ర‌రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top