మంత్రి లోకేష్‌కి వైయ‌స్ఆర్‌సీపీ స్ట్రాంగ్‌ కౌంటర్ 

 

తాడేపల్లి: ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అంశానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది వైయ‌స్ఆర్‌సీపీ. ఈ మేరకు వైయ‌స్ఆర్‌సీపీ శానమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, వరుదు కళ్యాణిలు పత్రికా ప్రకటన విడుదల చేశారు. శాసనసభలోగానీ, మండలిలోగానీ అధికార పక్షం తర్వాత ఎక్కువ సీట్లు ఉన్న పార్టీనే ప్రతిపక్షం అంటూ చట్టంలో ఉన్న విషయాన్ని ఎమ్మెల్సీలు బయటపెట్టారు.
కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీల తర్వాత ఉన్న ఏకైక పార్టీ వైయ‌స్ఆర్‌సీపీనేనని, కాబట్టి కచ్చితంగా వైయ‌స్ఆర్‌సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలన్నారు. ప్రజా సమస్యలపై వివరంగా మాట్లాడటానికి అప్పుడే తగినంత సమయం హక్కుగా వస్తుందన్నారు. కానీ ప్రభుత్వ లోపాలనె ఎత్తిచూపుతారనే భయంతోనే వైయ‌స్ఆర్‌సీపీని ప్ర‌ధాన  ప్రతిపక్షంగా గుర్తించ‌డం లేదన్నారు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీని సైతం ఇవ్వకుండా అడ్డుకున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.  

Back to Top