ఏరా అయ్యన్న.. నువ్వు, నీ నాయకుడు దొంగనాకొడుకులు

రాష్ట్రంలో సైకోనాకొడుకులు అయ్యన్న, చంద్రబాబు అని అందరికీ తెలుసు

సీఎం నర్సీపట్నంలో ఉన్నప్పుడు అయ్యన్నపాత్రుడు పిల్లిలా దాక్కున్నాడు

రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ దొంగలు అయ్యన్న, చంద్రబాబు

నోరు అదుపులో పెట్టుకోకపోతే.. నీకంటే రెట్టింపుగా మాట్లాడుతాం

అయ్యన్నకు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ వార్నింగ్‌

నర్సీపట్నం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తుగ్లక్‌లు, సైకోలు, చెత్తనాకొడుకులు ఎవరైంటే అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు, నారా లోకేష్‌ అని ప్రతీ ఒక్కరూ చెబుతారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ అన్నారు. అయ్యన్న పాత్రుడికి మైక్‌ దొరికితే.. ముఖ్యమంత్రిని, వైయస్‌ఆర్‌ సీపీ నాయకులను విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. ఏరా అయ్యన్న.. మాకు బూతులు రావనుకుంటున్నావా..? తిట్టలేమా..? అని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు దొంగనాకొడుకు, సైకో నాకొడుకు, తుగ్లక్‌ నా కొడుకు, శాడిస్టు నాకొడుకు, చెత్తనాకొడుకు, పోరంబోకు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు, లోకేష్‌ సైకోలు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ నాయకులపై, ముఖ్యమంత్రిపై విమర్శలు మానుకోకపోతే అయ్యన్నకంటే రెట్టింపుగా మాట్లాడుతామని హెచ్చరించారు. 

నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వందల కోట్లు సంపాదించుకున్న సైకో అయ్యన్నపాత్రుడు.. అధికారంలో పోయేసరికి మతిభ్రమించి మందు ఎక్కువై మతిలేని మాటలు మాట్లాడుతున్నాడన్నారు. నర్సీపట్నంలో సీఎంను అడ్డుకుంటామని మాట్లాడిన అయ్యన్న.. ఆరోజున సీఎం వైయస్‌ జగన్‌ నాలుగు గంటల పాటు నర్సీపట్నంలో ఉంటే పిల్లిలా దాక్కున్నాడన్నారు. 

తెలుగుదేశం పార్టీలో ఉంటూ రాజకీయ భిక్షపెట్టిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన దొంగనాకొడుకులు అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు కాదా..? అని ప్రశ్నించారు. గతంలో మంత్రిగా పనిచేసి నర్సీపట్టణాన్ని గంజాయి అడ్డాగా అయ్యన్నపాత్రుడు మార్చాడన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ దొంగలు అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు అని గుర్తుచేశారు. టీడీపీ నేతలు గ్రామాలకు వెళ్తుంటే.. ఇదేం ఖర్మరా బాబూ.. ఈ శాడిస్టునాకొడుకులు మళ్లీ వస్తున్నారని ప్రజలంతా ఛీకొడుతున్నారన్న విషయాన్ని అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలన్నారు. 

పెన్షన్లు రెండు వేలు ఇచ్చామని మాట్లాడేందుకు అయ్యన్నపాత్రుడికి సిగ్గులేదా..? అని ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ ప్రశ్నించారు. ఎన్నికలకు మూడు నెలల ముందు రూ.2 వేల పింఛన్‌ ఇచ్చి లబ్ధిదారులను ఉద్దరించినట్టగా మాట్లాడేందుకు సిగ్గులేదా..? అని నిలదీశారు. సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకను పెంచుకుంటూ వెళ్తున్నారని, ప్రస్తుతం రూ.2750 పెన్షన్‌ను లబ్ధిదారులు అందుకుంటున్నారని గుర్తుచేశారు. అమ్మ ఒడి పథకం అమలు చేస్తూ పిల్లలను బడికి పంపిస్తున్న తల్లుల ఖాతాల్లో రూ.15 వేల ఏటా జమ చేస్తున్నారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం అమలైందా..? అని ప్రశ్నించారు. 

టీడీపీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం.. లేకపోతే రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల్లో ఊదరగొట్టిన మీరు.. రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు.. ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో అయ్యన్నపాత్రుడు చెప్పాలని సవాలు విసిరారు. వలంటీర్లను యమధూతలు అని మాట్లాడేందుకు అయ్యన్నపాత్రుడుకు బుద్ధి ఉందా..? వలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. సచివాలయ వ్యవస్థ, వలంటీర్‌ వ్యవస్థ పక్క రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. అయ్యన్నపాత్రుడు నోరు అదుపులోపెట్టుకోకపోతే అంతకంటే ఎక్కువగా మాట్లాడుతామని ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ మరోసారి హెచ్చరించారు. 

175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా?
మాధైర్యం సీఎం వైయ‌స్‌ జగన్‌. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు సీఎం వైయ‌స్ జగన్ అమలు చేస్తున్నారు. మరో 30 ఏళ్లు వైయ‌స్ జగనే ముఖ్యమంత్రి. మీరెంత నోరు పారేసుకున్నా సీఎం వైయ‌స్ జగన్‌ కాలిగోటికి కూడా సరితూగరు. వేయి మంది చంద్రబాబులు వచ్చినా, లక్షమంది అయ్యన్నలు వచ్చినా వైయ‌స్ జగన్‌ని ఏమీ చేయలేరు. నువ్వు హోంమంత్రివై పోయినట్లు పగటి కలలుగని పోలీసులను బట్టలూడదీస్తామంటున్నావు. నీపై కేసు పెట్టడానికి పోలీసులు నీ ఇంటికి వస్తే.. పిల్లిలా దాక్కున్నావు. నీకు సిగ్గుందా? జనసేనతో టీడీపీ కలిస్తే మాకెందుకు భయం? ఆ మాటనడానికి మీకు సిగ్గుందా? మీరు అన్ని పార్టీల చుట్టూ తిరుగుతూ ఎవరు కలుస్తారా? అని ఎదురుచూస్తున్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ సింగిల్‌ గానే వస్తారు. 175 సీట్లూ గెలుస్తారు. 

నర్సీపట్నానికి అయ్యన్న చేసింది సున్నా
గత ఎన్నికల ప్రచారంలో.. నర్సీపట్నంలో పెద్దచెరువుకు ట్యాంక్‌ బండ్‌ కడతానన్నావు. శిలాఫలకం వేసి వదిలేశావు. ఇండోర్‌ స్టేడియం, ఇంటింటికీ తాగునీరు,  రోడ్లు విస్తరణ, కొత్తవీధిలో కళ్యాణమండపం వంటివి కట్టిస్తానని ప్రగల్భాలు పలికావు. చివరికి అక్కడ నువ్వేసిన శిలాఫలకాలు సమాధి ఫలకాలుగా మిగిలాయి తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. అయిదేళ్లలో నువ్వు శిలాఫలకాల మంత్రిగానే మిగిలావు. 

సీఎం వైయ‌స్ జగన్‌ వల్లే నర్సీపట్నానికి ప్రగతి
2019 ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ వైయ‌స్‌ జగన్‌ నర్సీపట్నం వచ్చిన సందర్భంలో, మున్సిపల్‌ పన్ను ఇబ్బందులు గురించి చెప్పగానే  అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 25 శాతం ఇంటిపన్ను తగ్గించారు. ఇదీ ఆయన ఘనత. నర్సీపట్నానికి రూ. 500 కోట్లతో మెడికల్‌ కాలేజీ ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని వైయ‌స్‌ జగన్‌ చెప్పారు. రూ. 470 కోట్లతో పత్తిపాడు, తుని రైతులను ఆదుకునేలా ఏలేరు నుంచి తాండవ రిజర్వాయర్‌ అనుసంధానం కార్యక్రమానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ శ్రీకారం చుట్టారు. నర్సీపట్నంలో రోడ్ల విస్తరణను రూ. 16 కోట్లతో చేస్తామని మాటిచ్చారు అని ఎమ్మెల్యే గణేష్ వివరించారు. 

Back to Top