కేంద్ర ఎన్నికల సంఘానికి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పోస్టల్ బ్యాలెట్ అంశంలో ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఛీఫ్ కమీషనర్ రాజీవ్ కుమార్ కి ఎంపీ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఇచ్చిన మెమో భారత ఎన్నికల కమిషన్ నిబంధనల కు విరుద్ధం అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధం. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ను తిరస్కరించేదుకు దారితీసేలా ఉంద‌ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపి సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమో ను తక్షణమే సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాలని ఎంపీ నిరంజ‌న్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Back to Top