సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి ఉద్యోగులంతా సమానమే 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి ఉద్యోగులంతా సమానమేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులను వాడుకోవాలనే ధోరణే కనబరిచాయన్నారు. ఉద్యోగులకు రాజకీయాలు వద్దని సీఎం స్పష్టంగా చెప్పారని సజ్జల తెలిపారు. ఉద్యోగులను రాజకీయాలను వాడుకునే ఉద్దేశం మాకు లేదని స్పష్టంచేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వామం కావాలని ఆయన కోరారు.
 

Back to Top