తాడేపల్లి: నేడు(అగస్టు 9న) అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి ఒడిలో నివసించే కల్మషం లేని మనుషులు ఆదివాసీలు. ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి నిలువుటద్దం వారు. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నా ఆదివాసి సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు అంటూ తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ సందేశం ఉంచారు.