మొహర్రం స్ఫూర్తిగా మానవతావాదానికి పునరంకితం కావాలి

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  మొహర్రం స్ఫూర్తిగా మానవతావాదానికి పునరంకితం కావాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆకాంక్షించారు. మొహ‌ర్రం మాసం ప్రారంభం సంద‌ర్భంగా ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో సందేశం పోస్టు చేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
`ముస్లిం సోదర, సోదరీమణులందరికీ అత్యంత పవిత్రమైన మొహర్రం మాసం ఇవ్వాళ్టి నుంచి ప్రారంభం అవుతోంది. మహ్మద్‌ ప్రవక్త మనవడు హజరత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ పవిత్ర మాసాన్ని భక్తి, శ్రద్ధలతో జరుపుకోవాలని, మొహర్రం స్ఫూర్తిగా మానవతావాదానికి పునరంకితం కావాలని  ఆకాంక్షిస్తున్నాను` వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Back to Top