తాడేపల్లి: చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర అసహనం ఉందని, ఆయనపై విరక్తితో టీడీపీ శ్రేణులు తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారని వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపుతూ వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుంతాం.. అని పుష్ప సినిమా డైలాగులు, పుష్పా సీన్లు, తగ్గేదేలే పుష్పా అని మేనరిజరం ప్రదర్శించినా కేసులు పెడతారా చంద్రబాబు?.. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? అని నిలదీశారు. పల్నాడులో పుష్ప ఫ్లకార్డు పట్టుకున్న యువకుడు గతంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడని, చంద్రబాబు పాలనపై విరక్తితో టీడీపీ శ్రేణులు.. ఇలా తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారేమోనని అని వైయస్ జగన్ అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. వైయస్ జగన్ ఏమన్నారంటే.. నాణేనికి రెండో వైపు.. ఇవాళ్టి ప్రెస్ మీట్.. రాష్ట్రంలో జరుగుతున్న ఈ మధ్య కాలంలో జరుగుతున్న కరెంట్ ఈవెంట్స్ అన్నింటి మీద నాణేనికి రెండో వైపు చూపించే ప్రయత్నం. ఎందుకంటే మనకు ఒక ఈనాడుతో, ఆంధ్రజ్యోతితో, టీవీ5తో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియా సామ్రాజ్యంతో కూడా యుద్ధం చేస్తున్నాం కాబట్టి మన వర్షన్ ప్రజల్లోకి సింక్ అయ్యే అవకాశాలు.. వాళ్లు చేస్తున్నంతగా మనది సింక్ కాదు కాబట్టి ప్రజలకు రెండో వైపున స్టోరీ తెలియాల్సి ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో జరుగుతున్న కరెంట్ ఈవెంట్స్ మీద ఈ ప్రెస్ మీట్. మోసాలు, అబద్ధాల మధ్య పాలన రాష్ట్రంలో ఈ రోజు దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, పాలనా వైఫల్యాలు, మోసాలు, అబద్ధాల మధ్య కొనసాగుతున్న చంద్రబాబుగారి పాలన. వీటన్నింటి నేపథ్యంలో మొన్న జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పిలుపు మేరకు ప్రజలు, వైయస్సార్ సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరూ ప్రతి నియోజకవర్గంలో పాలు పంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది? జనంలో ఏరకమైన స్పందన వచ్చిందన్నది మీకందరికీ తెలిసిందే. ఏడాదికే తీవ్ర వ్యతిరేకత సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే తక్కువ, అరుదైన పరిస్థితులేమో. అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ అసహనం కనిపిస్తోంది. అందుకే నియంతగా తాను మారి, అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు తయారయ్యారు. ఎందుకు ఇన్నిన్ని ఆంక్షలు? నిన్న నా ప్రోగ్రామ్ కూడా సత్తెనపల్లి పల్నాడు ఏరియాలో కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు ప్రజలను, లేదా మా పార్టీ కార్యకర్తల్ని పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్పా అని అడుగుతున్నా? చంద్రబాబును సూటిగా ఈ ప్రశ్న అడుగుతున్నా. ఎందుకు ఇన్నిన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసుల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రామ్ కు ఎవరూ రాకూడదు అని ఆదేశాలు జారీ చేసి, ఎందుకు వచ్చిన వాళ్లందరినీ ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? చంద్రబాబు నోట్లోంచి ఇటువంటి మాటలు వచ్చాయి కాబట్టే ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. నిన్న ప్రోగ్రామ్ ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పని లేదు. బహుశా నాకన్నా మీ అందరికే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఎందుకు భయపడుతున్నావ్ బాబూ? ప్రతిపక్ష నాయకుడు ప్రజల్ని కలవడానికి వెళ్లినప్పుడు గానీ, లేదా పార్టీ నాయకుల్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడుగానీ ఎందుకు ఇటువంటి ఆంక్షలు విధించాలి అని అడుగుతున్నా. మొన్న పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే అక్కడ కూడా నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం.. పొగాకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. అలాంటి నేపథ్యంలో ఇద్దరు ఆత్మహత్యలు జరిగాయి. పర్చూరు, కొండెపిలో. ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడ జరుగుతున్న పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే.. దాదాపుగా 40 వేల పైచిలుకు ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు... 40 మందే.. ఎంచినా కూడా అంతకన్నా ఎక్కువ మంది కూడా కనపడరు. 40 మందితో నువ్వు.. 40 వేల మందితో జరిగే ప్రోగ్రామ్ మీద రాళ్లు వేయాలని ప్రయత్నం చేస్తావు. ఆశ్చర్యం కలిగించే విషయం అది. ఏం జరుగుతోంది? రైతుల సమస్యలు హైలెట్ కాకూడదా? రైతుల తరఫున ఎవరూ మాట్లాడకూడదా? రైతులకు సంఘీభావంగా ఎవరూ వెళ్లకూడదా? రైతుల సమస్యలనేవి ఎవరూ పట్టించుకోకూడదా? 40 వేల మంది, ప్రజలు రైతులతో జరిగే కార్యక్రమాన్ని నువ్వు 40 మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావ్. ఇంకా రైతులు, ప్రజలు సంయమనం పాటించారు కాబట్టే 40 వేల మంది 40 మంది మీద పడలేదు. ఒకవేళ పడి ఉంటే పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా ఊహించుకోగలరు. 40 మంది చేత గొడవ నువ్వు చేయిస్తావు. ఉల్టా రైతుల మీద నువ్వే కేసులు పెడతావు. నేను అడుగుతున్నా చంద్రబాబును. ఎందుకు ఇంత భయపడుతున్నావు. ఎందుకింత అసహనం. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తున్నాడు. వరి కొనుగోళ్లకు సంబంధించి రైతు 300 రూపాయల తక్కువకు ధాన్యం మొన్న దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు పుణ్యాన. వరి దగ్గర నుంచి మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశనగ, అరటి, చీనీ, కోకో, ఇప్పుడు పొగాకు, మామిడి కూడా. ప్రతి పంటా కూడా ఏ పంటకూ కనీస మద్దతు ధర రావడం లేదు. రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు బాధాకరం ఈ మధ్య కాలంలోనే రెండు ఆత్మహత్యలు పొగాకు రైతులు పల్నాడు, కొండెపిలో జరిగితే, రెండు రోజుల కిందట పల్నాడులో కూడా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇద్దరు, వినుకొండలో ఒకరు.. మరో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. ప్రకాశం జిల్లాలో మన కళ్ల ఎదుటే రెండు ఆత్మహత్యలు జరిగితే, మరో మూడు ఆత్మహత్యలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అయినా కూడా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు. ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాడంట? ప్రజల సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు.. చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. భూ స్థాపితం చేస్తాడంట. ఆశ్చర్యం కలిగించే మాటలు. 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయన.. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాడంట. ప్రతిపక్ష నాయకుడి పేరు ఎత్తి భూస్థాపితం చేస్తాడంట. ఆ ఎల్లో మీడియాకు సంబంధించిన ఓనర్ అడుగుతాడు.. ఎప్పుడు భూస్థాపితం చేస్తావని, ఈయన అదిగో మొదలు పెట్టేశాను, చేస్తున్నాను, త్వరలో చేసేస్తాను అంటాడు. ఆశ్చర్యం.. 76 ఏళ్ల ముసలాయన ఈయన. ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి, ఈ బెదిరింపులేమిటి? వాడ్ని తొక్కుతా, వీడ్ని తొక్కుతా అన్న మాటలేమిటి? ప్రజలు, దేవుడు దయ తలచి అధికారం ఇచ్చారు, ఇచ్చిన ఆ అధికారంతో మంచి చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో, మోసాలతో పరిపాలన చేస్తూ.. వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. ఎవరు గళం విప్పకూడదా? ఈ చంద్రబాబు నాయుడు పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అంటే.. ఏడాది కాలంలో ఈ ప్రభుత్వంలో.. ఏ ప్రభుత్వంలో కూడా గతంలో ఎప్పుడూ చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు ఈరోజు చూస్తున్నారు. దీన్నుంచి డైవర్ట్ చేసేందుకు, ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులపై చంద్రబాబు పెడుతున్న తప్పుడు కేసులు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎవరు గళం విప్పినా, విప్పకూడదనే అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడుతున్నారు. టాపిక్ లు డైవర్ట్ చేస్తున్నారు. ఈ తప్పుడు కేసుల సంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్టుగా నా ప్రోగ్రామ్ కు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం, రెండో కారణం.. గొంతు నొక్కాలి ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండోది. భాస్కర్రెడ్డిని మద్యం కేసులో ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం.. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం భాస్కర్ ను అరెస్టు చేసిన తీరును చూస్తే. అసలు ఇంతకు ముందు మీరంతా చూస్తున్నారు. సంవత్సరం నుంచి భాస్కర్ పేరు లిక్కర్ లో కనిపించిందా? వినిపించిందా? ఎవడన్నా విన్నాడా? . భాస్కర్ ను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏందంటే భాస్కర్ గన్ మెన్ పోలీస్ కానిస్టేబుల్ ను పిలిచి భాస్కర్ కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉందని, ఆ స్కామ్ లో తాను ఉదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని, తాను డబ్బులేదో ఉన్నాయని, కానిస్టేబుల్ తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే.. ఆ గన్ మెన్ ఎవరైతే ఉన్నారో.. ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు నేను ఇవ్వలేను అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే, ఆ దెబ్బలుతిన్న డ్యూటీలో ఉన్న దెబ్బ తిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి, తనకు తగిలిన దెబ్బలు చూపిస్తూ, దెబ్బలను డిస్ ప్లే చేస్తూ, జరిగిన సంఘటన తాను చెబుతూ, డీజీపీకి లేఖ రాసి, గవర్నర్ కు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించాడు. కోర్టులో కేసు వేశాడు. నిన్న ఆ కేసు హియరింగ్ కు కూడా వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు సంవత్సరంగా చూస్తున్నాం ఏరోజూ ఎప్పుడూ దీంట్లోకి ప్రస్తావించను కూడా లేదు. సడన్ గా భాస్కర్ పేరు తీసుకొచ్చారు. భాస్కర్ ను ఇరికించేదాని కోసం ఇంకొక కానిస్టేబుల్ గిరిని తీసుకొచ్చారు. ఒకడు విన్నాడు, ఒకడు వినలేదు. గిరి అనే కానిస్టేబుల్ ను తీసుకొచ్చాడు. గిరి అనే వ్యక్తితో భాస్కర్ మాట్లాడాడట. ఎవరైనా ఎక్కడికి పోతున్నావు, ఎప్పుడొస్తావు అని మాట్లాడతారు. నా మాదిరి ఇంత మంది గన్ మెన్లు ఉండరు కాబట్టి.. ఒకరిద్దరు ఉంటే నువ్వు ఎక్కడున్నావని ఎవరైనా మట్లాడతారు. ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినారంట. అంటే నీ డ్రైవర్ తో గానీ, నువ్వు ఎక్కువసార్లు ఎవరితోనైనా మాట్లాడితే చాలు.. అది చాలు.. ఆ మనిషిని పిల్చుకుని రావడం, ప్రలోభాలు పెట్టడం, లేదా భయపెట్టడం, తప్పుడు స్టేట్మెంట్లు నీ ఇష్టం వచ్చినట్లుగా ఇప్పించడం, వాటి ఆధారంగా ఈయనను అరెస్టు చేయడం.. నిజంగా ఏం జరుగుతోంది? అదే మాదిరిగా ఇప్పించే ప్రయత్నం ఇంకో కానిస్టేబుల్ మీద కూడా చేస్తే, ఆ కానిస్టేబుల్ ఇష్టపడకపోతే ఆ మనిషిని కొట్టే స్థాయిలోకి వెళ్లిపోతే ఆ మనిషి ఏకంగా వీడియో తీసి జరిగిందంతా చెప్పి, వీడియోను, లెటర్ ను ఏకంగా డీజీపీకి, ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి, గవర్నర్ కు లేఖ రాసి కోర్టులో కేసు వేశాడు. అంటే ఈ మాదిరిగా ఇరికించాలనుకుంటే ఎవడు తట్టుకోగలుగుతాడు? ఎవరిరైనా ఇరికించేయొచ్చు. దీనికి అంతమెక్కడ? ఆశ్చర్యం నిజంగా. ఎవడైనా నీ గన్ మెన్ లేదా ఎవడినైనా పట్టుకుంటే చాలు.. చంద్రబాబు నాయుడు దగ్గరో, లోకేష్ దగ్గరో పని చేస్తున్న గన్ మెన్ ఒకడు దొరికితే చాలు.. ఎట్లా గవర్నమెంట్ లో ఎవరుంటే వారికి అనుకూలంగా చెబుతారు. అంటే ఇక ఆ మనిషి దగ్గర పని చేస్తున్నాడు, వ్యతిరేకంగా చెబుతాడు, ఇష్టమొచ్చినట్లు ఆరోపణ చేయొచ్చు, ఎత్తుకొని వచ్చి జైల్లో పెట్టేయొచ్చు. ఏందిది? సామాన్యుడు ఎలా బతకగలడు? నిజంగా భాస్కర్ కు జరిగిన పరిస్థితికి గానీ, ఈ లిక్కర్ కేసులో జరుగుతున్న దర్యాప్తు ప్రక్రియ గానీ ఇవన్నీ కూడా చూస్తే సామాన్యుడు ఎవడూ బతకలేడు. ఎవడెన్స్ అనేవి నువ్వు క్రియేట్ చేస్తున్నావు, మాన్యుఫాక్చర్ చేస్తున్నావు. ఈ మాదిరిగా తప్పుడు సంప్రదాయానికి నువ్వు నాంది పలికితే రేప్పొద్దున వ్యవస్థ బతుకుతుందా? నక్సలిజం అనేది ఇట్లాంటి దాంట్లో నుంచే పుడతాది. సామాన్యుడి మీద ఇట్లాంటివి ఎవడైనా ప్రదర్శిస్తేనే నక్సలిజం అనేది పుడుతుంది. నిజంగా రాష్ట్రాన్ని బిహార్ చేయడంలో గొప్ప లీడర్, గొప్ప నాయకుడు చంద్రబాబు కన్నా ఎవడూ ఉండడు. చివరకు ఆశ్చర్యం ఏంటో తెలుసా? చంద్రబాబు సొంత నియోజకవర్గం కాబట్టే.. భాస్కర్ ను ఎందుకు టార్గెట్ అంటే చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం. భాస్కర్ అనే కాదు, చివరకు భాస్కర్ కొడుకును కూడా.. ఆ పిల్లోడు మొన్ననే పాపం చదువులు అయిపోజేసుకుని లండన్ నుంచి వచ్చాడు. ఆ పిల్లోడిని కూడా దీంట్లోకి ఇరికించేశాడు. అంటే చంద్రగిరి నియోజకవర్గంలో క్లీన్ ఉండాలి. ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి. ఎందిది? నాకు అర్థం కావడం లేదు. సొంత నియోజకవర్గంలో గెలవలేని వ్యక్తి, ఇక్కడ 17 వేలుతో ఓడిపోతే, చంద్రగిరిలో తంతే ప్రజలు చంద్రబాబును 17 వేలతో ఓడిస్తే కుప్పం పోయాడు. చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయాలని చెప్పి.. భాస్కర్ ను, భాస్కర్ కొడుకును అందర్నీ ఎలిమినేట్ చేయాలని, తప్పించాలని.. ఏంది ఈ రాజకీయాలు. ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల.. 2019 ఎమ్మెల్యే 2012 ఎమ్మెల్యే, 2014 ఎమ్మెల్యే, 2019 ఎమ్మెల్యే.. నాలుగు సార్లు ఎమ్మెల్యే. 2024లో మొన్న ఓసారి ఓడిపోయాడు. ఆ నియోజకవర్గంలో అజమాయిషీ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికించే కార్యక్రమం. అక్రమ కేసులు.. నందిగం సురేష్ ను.. ఎక్స్ ఎంపీ, దళితుడు. రెండుసార్లు జైల్లో పెట్టాడు. ఒకసారి జైల్లో పెడితే నెలరోజులు.. సుప్రీంకోర్టు దాకా కూడా పోయాం. కిందామిందా పడి ఎట్లనో తనను విడిపించుకుని వచ్చాం. ఇప్పుడు మళ్లా అరెస్టు. ఇప్పుడు మూడు వారాల నుంచి జైల్లో ఉన్నాడు. సురేష్ భార్య.. ఆవిడ మీద కూడా కేసులు. వల్లభనేని వంశీ దాదాపుగా రెండు నెలలు దాటింది. ఒక కేసు అయిపోతానే మళ్లీ ఇంకొక కేసు. ఒక కేసులో బెయిల్ వస్తానే మళ్లా ఇంకో కేసు. ఇప్పటికి 11 కేసులు అయినట్లు ఉన్నాయి. జోగి రమేష్ కొడుకును, కాకాణి గోవర్ధన్ ను, కృష్ణమోహన్ అన్నను, నా ఓఎస్డీ పాపం.. ఆయన్ను చూస్తే కూడా జాలి అనిపిస్తుంది. ఆయన ఆర్డీవో. ధనుంజయరెడ్డి.. ఆయన్ను చూసినా పాపం అనిపిస్తుంది. వీళ్లంతా మచ్చలేని ఆఫీసర్లు. రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఇలాంటి వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలా అని వెంటపడుతున్నారు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబునాయుడుని ఎప్పుడో కాలేజీలో కొట్టాడంట. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. వాళ్ల కొడుకును అరెస్టు చేయాలంటాడు, వాళ్ల నాయన్ని అరెస్టు చేయాలంటాడు. పేర్ని నాని.. ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు. పేర్ని నాని భార్య జయసుధమ్మ.. ఆమె మీద కూడా పాపం. ఎప్పుడు అరెస్టు చేయాలా అన్నదే బాబు తాపత్రయం కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, వైవీ సుబ్బారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కొడుకు, దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్, ఆర్కే, అంబటి రాంబాబు, విడదల రజిని, తాటిపర్తి చంద్రశేఖర్ దళిత ఎమ్మెల్యే, బూచేపల్లి శివప్రసాద్, ఉషాచరణ్ బీసీ మహిళా మాజీ మంత్రి, తోపుదుర్తి ప్రకాశ్, గోరంట్ల మాధవ్ ఎక్స్ ఎంపీ, గౌతమ్ రెడ్డి లాయర్ ఆయన పాపం.. విజయవాడలో మీ అందరికీ పరిచయం, మేరుగు నాగార్జున దళిత మాజీ మంత్రి, దాడిశెట్టి రాజా ఎక్స్ మినిస్టర్, ఈ నాయకులందరి మీదా తప్పుడు కేసులు పెట్టడం, వీళ్లను ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలా అని తాపత్రయపడుతున్నాడు చంద్రబాబు. జగన్ చుట్టూ ఉన్నవాళ్లందరిని బెదిరించాలి.. వైయస్ జగన్ చుట్టూ ఉన్నవాళ్లలంరినీ బెదిరించాలి.. భయపెట్టాలి..మోడస్ ఆపరాండా ఒకటి.. చిన్నచిన్న వ్యక్తులను కొట్టడం.. భయపెట్టడం.. లేదా ప్రలోభాలు పెట్టడం.. వాళ్ల నుంచి తప్పుడు వాంగ్మూలాలు తీసుకోవడం.. వారిని అరెస్టు చెయడం.. అన్నింటికీ ఇవే.. సేమ్ మోడస్ ఆపరాండా..చిన్న చిన్న వ్యక్తులు కొట్టడం.. భయపెట్టడం.. స్టేట్ మెంట్లు తీసుకోవడం..వీళ్లని అరెస్టు చేసే కార్యక్రమం చేయడం.. అన్ని తప్పుడు కేసులు.. తప్పుడు ఆలోచనలు.. తప్పుడు పనులు..చివరికి అన్నింటికంటే ఎక్కువగా ఆశ్చర్యం కలిగించే .. బాధ కలిగించే విషయం..70 ఏళ్ల వృద్ధుడు కొమ్మినేని శ్రీనివాసరావు.. మీ తోటి జర్నలిస్ట్.. రిప్యూటెడ్ విలేకరి.. సీనియర్ జర్నలిస్ట్.. ఏం పాపం చేశాడని అడుగుతా ఉన్నా...ఆయనను జైలుకు పంపించేందుకు చంద్రబాబు అంత ఉత్సాహం చూపించాడు.. ఇది ధర్మమేనా..ఒక డిబేట్ జరిగేటప్పుడు.. సహజంగానే కొందరు అనుకూలంగా మాట్టాడతారు.. కొందరు వ్యతిరేకంగా మాట్లాడతారు..ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్ కు ఏం సంబంధం? ఇది మినిమం లాజికల్ రీజనింగ్.. అలాంటిది ఆయనను తీసుకొచ్చి జైల్లో వేశాడు..ఆయన మీద చంద్రబాబుకు కోపమెక్కువే అనుకోండి..ఇంతకు ముందు ఆయన ఉద్యోగం ఊడగొట్టే విషయంలో చంద్రబాబు చాలా క్రియాశీలక పాత్ర పోషించాడు. అంతటితో సంతోషపడలా.. ఉద్యోగం ఊడగొట్టడంతో..ఆయన జీవితం నాశనం చేయాల.. ఆయన పరువును తీయాలా.. జైల్లో పెట్టాల.. ఎంత దిక్కుమాలిన ఆలోచనలు ఇవి..ఆ రకంగా ఆయనను అరెస్టు చేయించాడు. ‘సాక్షి’పై దాడులు విచ్చలవిడి రౌడీయిజం కాదా? కొమ్మినేనిని అరెస్టు చేయించడమే కాకుండా.. సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం.. ఎక్కడెక్కడైతే సాక్షి ఆస్తులు ఉన్నాయో అక్కడ ఆర్కస్ట్రేటెడ్ గా.. టీడీపీ నేతలు సాక్షి ఆస్తులను ఆర్కస్ట్రేటెడ్ గా టార్గెట్ చేసి.. అటాక్ చేసి విధ్వంసం చేశారు. శ్రీకాకుళంలో తెలుగు మహిళ టౌన్ ప్రెసిడెంట్ మెట్టా శైలజ, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ భార్య గొండు స్వాతి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండా దాసు నాయుడు, విశాఖపట్నం సాక్షి ఆఫీసును 26వ డివిజన్ కార్పొరేటర్ బుక్కా శ్రావణి, తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, తూర్పుగోదావరి సాక్షి ఆఫీసుపై..అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పేరుకే బీజేపీ ఎమ్మెల్యే కానీ.. ఆయన టీడీపీ ఎమ్మెల్యే అని అందరికీ తెలుసు..రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఈ కూటమి అందరూ ఇట్టాంటోడే.. చంద్రబాబు అట్టాంటోడే.. ఈయన అట్టాంటోడే..విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీసుపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య, మాజీ మేయర్ గద్దె అనురాధ, వారి కుమారుడు గద్దె క్రాంతి..మంగళగిరి సాక్షి ఆఫీసు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష, అనంతపురం సాక్షి ఆఫీసుపై టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సంగా స్వాతి, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సంగా తేజస్విని, కడప సాక్షి ఆఫీసుపై టీఎన్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్, తిరుపతి రేణుగుంట సాక్షి ఆఫీసుపై డిప్యూటీ మేయర్ ఆర్ సీ మునికృష్ణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం.. ఇతను తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా గతంలో వైయస్సార్ సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశాడు.. ఇప్పుడు సాక్షి ఆఫీసులపై దాడి చేసే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరించాడు. నెల్లూరు సాక్షిపై నెల్లూరు టీడీపీ అధ్యక్షురాలు కె.రేవతి, ఏలూరు సాక్షి ఆఫీసుపై తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ దాడులు చేశారు. నేను అడుగుతా ఉన్నా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతా ఉంది పత్రిక, టీవీ చానల్ అని.. గొంతు నులపడం కోసం ఆర్కెస్ట్రేటెడ్ గా నువ్వు.. నీ టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి.. నీ ఎమ్మెల్యేలు, నువ్వు చేసే కార్యక్రమం.. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా... సుప్రీం కోర్టు చంద్రబాబు చెంప చెల్లుమనిపించింది చివరికి సుప్రీంకోర్టు...ఇదే కొమ్మినేని గారికి.. సాధారణంగా అరెస్టు చేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు అంత తేలిగ్గా బెయిల్ ఇవ్వదు..రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద విచక్షణాధికారాన్ని ఉపయోగించి..వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఇదే కొమ్మినేని శ్రీనివాసన్నను.. ఇది చంద్రబాబు చెంప చెల్లుమనిపించడం కాదా? అదే కేసులో సాక్షి కార్యాలయాలను టీడీపీ కార్యకర్తలందరితో దగ్ధం చేస్తే.. దానికి గవర్నమెంట్ లో ఉన్న చంద్రబాబు బాధ్యుడు కాదా? కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం తప్పు అని.. విచక్షణాధికారాన్ని ఉపయోగించి చంద్రబాబు చెంప చెళ్లుమనిపించిన సుప్రీంకోర్టు. మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా ధ్వంసం చేస్తా ఉంటే.. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంటే.. మరి చంద్రబాబు ఇందులో దోషి కాదా? ఒక ముఖ్యమంత్రి గా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది..ఇది తప్పుడు సాంప్రదాయం కాదా?. ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపు ఎవరైనా బతుకుతారా? ఈ రోజు సాక్షి,, రేపు ఎన్ టీవీ కావొచ్చు..టీవీ 9 విలేకరి కావొచ్చు.. రేపు ఇంకొక్కడు.. ఇంకొక్కడు కావచ్చు.. బతుకుతారా ఎవరైనా? ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా ఇది.. రేపు ఈయనకు వ్యతిరేకంగా ప్రజా శక్తి కావొచ్చు.. ఇంకెవరైనా కావొచ్చు..ఎవరు మాట్లాడినా.. ఎవరు రాసినా.. ఎవరు చూపించినా.. రెడ్ బుక్ రాజ్యాంగం. కరెక్టేనా ఇది? మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా? నిజంగా మహిళల పట్ల చంద్రబాబుకి గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నా. సిన్సియర్ గా అడుగుతా ఉన్నా..గౌరవం ఉందా చంద్రబాబు నీకు అని.. ఎందుకు అడుతున్నా అంటే. నిజంగా గౌరవం ఉన్న వ్యక్తులైతే.. సత్యసాయి జిల్లాల రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాల పల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత చిన్నారిని.. టీడీపీ వాళ్లు 14 మంది సామూహిక అత్యాచారం చేస్తే.. ఆ బాలిక గర్భం దాలిస్తే.. ఈ విషయం బయటికి వచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా.. టీడీపీ వాళ్లు భయపెట్టిన మాట వాస్తవం కాదా? ఆ పాపకు తండ్రి కూడా లేడు.. అలాంటి తండ్రి లేని కుటుంబాన్ని వీరు చేసిన పనులతో ఊరు విడిచి పెట్టి వెళ్లిన విషయం వాస్తవం కాదా? పోలీసులు ఏం చేశారని అడుగుతా ఉన్నా నీ గవర్నమెంట్ లో.. ఆ దళిత పాపకు తోడుగా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం ఎందుకు లేవని అడుగుతా ఉన్నా..ఆ ఆడబిడ్డ జీవితాన్ని రాజకీయంతో ముడేశాడు..న్యాయం చేయాలని ఈ మనిషికి ఏ కోశానా సిన్సియారిటీ లేదు.. మహిళలంటే గౌరవం ఉన్నవాళ్లు చేసే పనేనా ఇది అని అడుగుతా ఉన్నా..అదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంకో ఘటన.. ఇంటర్మీడియట్ చదువుతా ఉన్న గిరిజన బాలిక సాకే తన్మయి..ఆ బిడ్డ కనపడటం లేదని జూన్ 3న తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు..ఎవ్వరూ పట్టించుకోలేదు.. ఆరురోజుల తర్వాత ఆ పాప శవమై కనిపించింది. అసలు రాష్ట్రంలో కేసులు మీద దర్యాప్తు చేయాలి..ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి..అనే ఆలోచన ఎవరికైనా ఉందా? కనీసం టైం ఎవరికైనా ఉందా? ఎంత సేపు రెడ్ బుక్ రెడ్ బుక్..రెడ్ బుక్.. ఎంత సేపు వాళ్లని ఇరికించాలా? వాళ్లని ఇరికించాలన్న తాపత్రయం.. ఆడవాళ్ల గురించి వీళ్లు మాట్లాడతారు.. చంద్రబాబు సొంత నియజకవర్గం కుప్పంలోని నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే పేద కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య శిరీషను టీడీపీ కార్యకర్తలు చెట్టుకు కట్టేశారు...అది జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి దానిని రిపోర్టు చేస్తే.. దానిని ఫొటోలతో సహా చూపిస్తే.. పబ్లిష్ చేస్తే.. నెట్ లో వైరల్ అయితే.. అప్పుడు చంద్రబాబు మేల్కొంటాడు..కుప్పం కాదా..వైరల్ అవుతా ఉంది..సోషల్ మీడియాలో కూడా ఫొటోలతో సహా వైరల్ అవుతాఉంది.. అప్పుడు రూ.5 లక్షలు డిక్లేర్ చేస్తాడు.. ఈ మనిషా మహిళల గౌరవం గురించి మాట్లాడేది..? ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నాడు..ఎన్నికలకు ముందు సూపర్ సెవెన్ అన్నాడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆడవాళ్లను వెన్నుపోటు పొడిచాడు..ఈ మనిషా ఆడవాళ్ల గౌరవం గురించి మాట్లాడేది? ఓ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ.. తన కాళ్ల మీద నిలబడగలిగే పరిస్థితి రావాలి.. ప్రతి కుటుంబంలోనూ అక్క చెల్లెమ్మలను దేవతల్లా చూసుకునే పరిస్థితి రావాలని ఆరాటపడింది మేము..వారి ఆర్థిక ఎదుగుదల కోసం ఏకంగా రూ.లక్షా 89 వేల కోట్లు డీబీటీగా 19 పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు నేరుగా అందించాం. వారి కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు 2 లక్షల 73 వేల కోట్లు డీబీటీ, నాన్ డీబీటీగా.. వారి కుటుంబాలకు మేలు జరగాలి.. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడాలి.. అని ఆరాటపడుతూ వాళ్ల కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది.. ఏకంగా 32 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్టర్ చేశాం..ఒక్కొక్కరి పేరుతో నాలుగు లక్షలు.. ఐదు లక్షలు.. పది లక్షలు విలువైన ఇళ్ల పట్టాలను వారి పేరుతో రిజిస్టర్ చేశాం. అందులో 22 లక్షలు ఇళ్లు మంజూరు చేసి 10 లక్షల ఇళ్లు కూడా కట్టించడం జరిగింది. మిగతావి కూడా వేగంగా మేము ఉన్న సమయంలో మిగతా 12 లక్సల ఇళ్లు కూడా కట్టించేందుకు చర్యలు తీసుకున్నాం.. వెన్నుపోటు పొడవడంలో ఆయనకు ఆయనే సాటి చట్టం చేసి మరీ అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్క్ ల్లో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చేటట్టుడు చట్టం చేసి అమలు చేసి చూపించాం. ఇంతకు ముందు లేదు ఎప్పుడూ.. అలా చట్టం చేసి ఇచ్చింది మా ప్రభుత్వం. ఎవరికి మహిళల మీద గౌరవం ఉంది అని అడుగుతా ఉన్నా..మహిళలకు మంచి చేసిన మాకా.. ఆ ముసుగులో దౌర్జన్యం చేసే ఆ పెద్ద మనిషికా? ఆ ముసుగులో రాక్షసత్వం ప్రదర్శించే ఆ పెద్ద మనిషికా? మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. .సరికదా..మహిళలైనా..పిల్లలైనా.. పిల్లనిచ్చిన మామకైనా. వెన్నుపోటు పొడవటంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి..ఎన్నికలకు ముందు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా.. జగన్ కన్నా ఎక్కువ చేస్తా అన్నాడు. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు.. రిబ్బన్ కూడా కట్ట చేయకుండా మొత్తం చేశేసానని అంటున్నాడు.. చూ మంతర్ అంటూ సూపర్ సిక్స్ చేసేశాను.. సూపర్ సెవెప్ నెరవేర్చేశాను అని ఊదరగొడతా ఉన్నాడు.. ఆయన, ఆయనఎల్లోమీడియా.. సోషల్ మీడియా. సూపర్ సిక్స్ ఏమైంది?.. సూపర్ సెవెన్ ఏమైంది అని ఎవరైనా అడిగితే.. నీ నాలుక మందం అని బెదరిస్తా ఉన్నాడు.. ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని బెదిరిస్తా ఉన్నాడు కదా? నేను చంద్రబాబును అడుగుతా ఉన్నా..? నిరుద్యోగ భృతి ఏమైంది? ఎవరైనా సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఏమైందని అడిగితే వాళ్ల నాలుక మందం అని బెదిరిస్తున్నాడు. నేను అడుగుతున్నా.. నిరుద్యోగ యువతకి నెలకు రూ. 3వేలు ఇస్తానన్నావు. అంటే ఏడాదికి రూ. 36 వేలు ఎంతమందికి ఇచ్చావని అడుగుతున్నా. ఏప్రిల్ 17, 2025న ఈనాడులో వచ్చిన ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో ఉపాధి లేని వారు కోటిన్నరపైనే అని రాశారు. టీడీపీ గెజిట్ పత్రికలో వచ్చిన లెక్క ప్రకారమే కోటీ 56 లక్షల మంది ఉపాధి లేని వారు ఉన్నారని చెప్పారు. వారందరికీ ఏడాదికి రూ. 36 వేలు ఇస్తామని చెప్పారు కదా.. ఒక్క పైసా అన్నా ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నా? ఏవీ చేయకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందం అని బెదిరించడం ధర్మమేనా, ఇది మోసం కాదా అని అడుగుతున్నా. 142 హామీలు నెరవేర్చానని చెబుతున్నాడు. రూ. 36 వేలు ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలేదు. ఆడబిడ్డ నిధి ఎగురగొట్టి పీ4 అంటున్నాడు ఆడబిడ్డ నిధి పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18 వేలు ఇస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్టు ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళల సంఖ్య 2,10,58,615 మంది. ఇందులో 60 ఏళ్లు నిండిన వారిని తీసేస్తే 1.80 కోట్ల మంది ఉంటారు. వీరందరికీ ఏడాదికి 18 వేలు ఇస్తామన్నారు. ఏడాది పాలనలో ఎంతమందికి ఇచ్చావని అడుగుతున్నా. ఇది మోసం కాదా? ఇవ్వకుండా ఇచ్చేశామని అబద్ధాలు చెప్పడమే కాకుండా ఇప్పుడు పీ4 అని డ్రామా ఆడుతున్నాడు. నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవరో శ్రీమంతుడిని చూపించి ఒకరిద్దరికి ఇప్పిస్తానంటున్నావు. దీపం, ఉచిత బస్సు అనేవి చిన్న చిన్న పథకాలు. అవి కూడా సక్రమంగా అమలు కాలేదు. దీపం పథకంలో ఒక్క సిలిండర్కే దిక్కులేదు దీపం పథకం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ సోర్స్ స్టేట్ వైజ్ యాక్టివ్ డొమిస్టిక్ కస్టమర్స్ ఆఫ్ ఎల్పీజీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కోటీ 59 లక్షల 20 వేల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని తెలుస్తోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్లో ఏ రాష్ట్రానికి ఎన్నెన్ని కనెక్షన్లు ఉన్నాయని తెలుస్తుంది. కోటీ 59 లక్షల 20 వేల మందికి సిలిండర్కి రూ. 877ల చొప్పున మూడు సిలిండర్లకు అయ్యే ఖర్చు రూ. 4,109 కోట్లు. కానీ ఈ రూ. 4,109 కోట్లకు గాను మొదటి ఏడాది బడ్జెట్ కేటాయింపు చూస్తే కేవలం రూ. 865 కోట్లు. అంటే, మిగిలిన రూ. 3244 కోట్లు చేసింది మోసం కాదా అని అడుగుతున్నా. అక్కడా మళ్లీ మోసం, బోగస్సే. కనీసం ఒక్క సిలిండర్ పూర్తిగా ఇవ్వాలన్నా కూడా రూ. 1,370 కోట్లు కావాలి. అందులోనూ ఇచ్చింది కేవలం రూ. 865. దీన్ని బట్టి ఒక్క సిలిండర్ కూడా సరిగా అందరికీ ఇవ్వలేదని అర్థమైంది కదా. పండగలు మారినా ఉచిత బస్సు రాలేదు మహిళలకు ఉచిత బస్సు.. అన్నింటికన్నా సులభమైన పథకం. మా కడపలో మహిళలంతా ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం చూసి మరుసటి రోజు తిరిగిరావాలని చూస్తున్నారు. ఈ పథకానికి ఏడాదికి రూ.275 కోట్లు అవుతుంది. ఆర్టీసీకి రూ. మూడు వేలకోట్లు ఇస్తే ఈ పథకం అమలు చేయొచ్చు. వచ్చాడు చేస్తానన్నాడు. ఏడాదైపోయింది. పండగల పేర్లు మారుతున్నాయి కానీ పథకం అమలు కాలేదు. ఫస్ట్ ఉగాది అన్నాడు. మళ్లీ దసరా, దసరా, సంక్రాంతి అన్నాడు. మళ్లీ ఉగాది అయిపోయింది. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. అధ్యయనం చేయాలి అంటున్నాడు. దానికి అధ్యయనం ఏముంటుంది? ఎవరు ఎక్కడికి పోవాలో వెళ్తారు. వస్తారు. విజయవాడ వచ్చి దుర్గమ్మను దర్శనం చేసుకుని వెళ్తారు. ఎక్కడెక్కడ టూరిజం ప్లేసులున్నాయో అక్కడంతా తిరిగేసి చూసి వస్తారు. ఇదే కదా ఆయన ఎన్నికలప్పుడు చెప్పింది. దానికీ ఇంతవరకు మోక్షం లేదు. 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వకపోగా 5 లక్షల పింఛన్లు పీకేశాడు 50 ఏళ్లకే పింఛన్ అన్నాడు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ మహిళలు కనీసం 20 లక్షల మందికి పైగా ఉన్నారు. నెలకు రూ. 4 వేల చొప్పున వీరికి పింఛన్ అమలు చేస్తే ఏడాదికి కనీసం రూ. 9,600 కోట్లు కావాలి. మొదటి ఏడాది ఒక్కరికి ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు. రెండో ఏడాది ఇంతవరకు ఇవ్వలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం నాలుక మందం అని బెదిరిస్తున్నాడు. పైగా అన్నింటి కన్నా దారుణం ఏంటంటే ఇచ్చే పింఛన్లు కూడా తగ్గించేశాడు. ఎన్నికల నాటికి పింఛన్లు (మార్చి 2024) 66,34,742 పింఛన్లు పంపిణీ చేస్తే, ఈనెలలో ఇచ్చిన పింఛన్లు 61,48,697 మాత్రమే. దాదాపు 5 లక్షల (4,86,045) పింఛన్లు పీకేశాడు. సంవత్సరం తిరిగేసరికి ఒక్కరికి కూడా కొత్త పింఛన్లు ఇవ్వకపోగా 5 లక్షల పింఛన్లు పీకిపారేశాడు. 50 ఏళ్లు నిండిన వారికి అదనంగా పింఛన్లు ఇస్తానని మాట చెప్పి 20 లక్షల మంది ఎస్సీ,ఎస్టీ ,బీసీ,మైనారిటీ మహిళలను మోసగించాడు. మళ్లీ ఏమంటాడు.. నేను ఇచ్చేశానంటాడు. ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటాడు. రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు..ఇది మోసం కాదా? రైతుకు సంవత్సరానికి ఇప్పుడు ఇచ్చేది కాకుండా రూ.20 వేలు ఇచ్చేట్టుగా తెలుగు దేశం పార్టీ నిర్ణయం చేసింది. పీఎం కిసాన్ నిధి పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాక, ఈయన అదనంగా రూ.20 వేలు ఇస్తామని ఊదరగొట్టి, దానికి అన్నదాత సుఖీభవ అనే పేరు పెట్టారు. నిరుడు సంవత్సరం ఒక్కరికీ కూడా రూపాయి ఇవ్వలేదు. ఇది మోసం కాదా? మళ్లీ ఎవరైనా అడిగితే, ప్రశ్నిస్తే నాలుక మందం అని బెదిరింపు. రాష్ట్రంలో 53,58,666 మంది రైతులకు రూ.20 వేలు ఇచ్చి ఉంటే రూ.10,716 కోట్లు ఇచ్చి ఉంటే రైతులకు మేలు జరిగేది. ఇదంతా ఇవ్వకుండా ఎగురగొట్టాడు. తల్లికి వందనం పేరుతో వంచన తల్లికి వందనం పేరిట తల్లులందరిని చంద్రబాబు వంచిస్తున్నాడు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోమని చంద్రబాబు ఎన్నికల్లో పదేపదే చెప్పాడు. ‘తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా ఆంక్షలు లేవు, కటింగ్లు లేవని మా ఆడబిడ్డలకు మాటిస్తున్నా’ అంటూ చంద్రబాబు అన్న మాటలు ఇవి. యూడిఐఎస్ఈ డేటా పరిశీలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కలెక్టర్లు డేటాను అప్లోడ్ చేస్తారు. దీంట్లో ఏం రాశారు. 2023–24 డేటా 83, 41,885 మంది పిల్లలకు ఎలాంటి ఆంక్షలు లేవు, ఎలాంటి కటింగ్లు లేవు. అందరికీ తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు అన్నారు. వీరికి రూ.15 వేల చొ ప్పున కావాలి. రూ.13115 కోట్లు కావాలి. ఇప్పుడు ఇస్తామంటున్నది కేవలం రూ.8700 కోట్లు అంటున్నారు. చివరికి ఎంత మందికి ఎగనామం పెడుతారో చూడాలి. దాదాపుగా 30 లక్షల మంది విద్యార్థులకు కోత పెడుతున్నాడు. మేం గట్టిగా నిలదీస్తే..వెంటనే ప్లేట్ మార్చి రూ.15 కాదు, రూ.13 వేలే ఇచ్చేది. 67 లక్షల మందికి ఇస్తున్నామని ప్లేట్ మార్చారు. అది కూడా ప్లేట్ మార్చి ప్రస్తుతానికి 57 లక్షల మందికే ఇస్తున్నామని మాట మార్చారు. నీకు, నీకు, నీకు సంగతి పక్కన పెడితే కొందరికి మాత్రమే రూ.13 వేలు మాత్రమే అని తేలింది. మరి ఇది మోసం కాదా చ ంద్రబాబూ. ఈ మోసాన్ని ప్రశ్నిస్తే ..నీ నాలుక మందం అని బెదిరిస్తాడు. ఇంకా ఎవరైనా అడిగితే తప్పుడు కేసులు పెడతాడు. మేం తెచ్చిన సంస్కరణలన్నీ నాశనం చేశారు ఒకవైపున ఉన్న ఈ పథకాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అప్పట్లో అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లికి డబ్బులు ఇచ్చాం. తల్లులు తమ బిడ్డలను బడులకు పంపించండి అని ప్రోత్సహిస్తూ అమ్మ ఒడిని ఇచ్చాం. 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి ఇచ్చాం. 84లక్షల మంది పిల్లలను బడుల బాట పట్టించాం. ఇప్పుడు ఒకవైపు సిన్సియార్సిటీ లేకుండా ఈ పథకాన్ని భ్రష్టుపట్టించారు. మా ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన సంస్కరణలు అన్నీ కూడా నాశనం చేశాడు. మా ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఇంగ్లీష్మీడియం బడులు పోయాయి. 3వ తరగతి నుంచి టోఫెల్ పోయింది. 3వ తరగతి నుంచి సబ్జెట్ టీచర్ కాన్సెప్ట్ పోయింది. చిక్కీతో ఇచ్చే గోరుముద్దా పోయింది. నాడు నేడు పనులు ఆగిపోయాయి. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం ఆగిపోయింది. 8వ తరగతి పిల్లలకు ఇచ్చే ట్యాబ్లు ఇవ్వడం లేదు. మా హాయంలో నో వెకెన్సీ బోర్డులు కనిపించేవి. చివరికి పదో తరగతి వాల్యూషన్ కూడా సక్రమంగా చేయలేని అధ్వాన్నమైన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. విద్యా దీవెన, వసతి దీవెన ఏవీ? మా ప్రభుత్వ హయాంలో పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్లం. ప్రతి ఏప్రిల్ లో వసతి దీవెన ఒక ఇన్స్టాల్మెంట్ఇచ్చేవాళ్లం. పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి ఉండేది కాదు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం లేకుండా గొప్పగా చదివించే తపన, తాపత్రయం మా హయాంలో కనిపించేది. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ జూన్ వస్తే ఆరు త్రైమాసికాలు అవుతుంది. ఎన్నికల కోడ్ కారణంగా అప్పట్లో పోస్ట్ఫోన్ అయ్యింది. ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు ఇవ్వాలి. రూ.4,200 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల సమయంలో ఆగిపోయిన ప్రక్రియ ఇంత వరకు ప్రారంభం కాలేదు. వసతి దీవెన రెండు విడతలు రూ.2200 కోట్లు , విద్యా దీవెనకు సంబంధించి ఆరు త్రైమాసికాలకు..ఈ రెండు పథకాలకు కలిపి రూ.6200 కోట్లకు గాను కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఈయన ఇచ్చాడు. వసతి దీవెన రద్దు అయినట్లుగా మాట్లాడుతున్నాడు. విద్యా దీవెన గురించి తప్పుడు మాటలు మాట్లాడుతాడే తప్ప ..ఇవ్వాలనే తాపత్రయం ఎక్కడా చంద్రబాబులో కనిపించడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3,600 కోట్లు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిస్థితి దారుణంగా తయారైంది.. రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మేము చేశాం. 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు పెంచి ప్రతీ పేదవాడికి వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చాం. అప్పులపాలయ్యే పరిస్థితి లేకుండా వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నా కూడా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కూడా ఆరోగ్యశ్రీ అందించాం. నెలకు రూ.40 వేలు సంపాదించే వారికి కూడా ఆరోగ్యశ్రీ అందజేశాం. పథకానికి అయ్యే ఖర్చు రూ.300 కోట్లు నెలకు అవుతుంది. చంద్రబాబు వచ్చిన 12 నెలలకు ఆరోగ్యశ్రీకి పెట్టిన బకాయిలు రూ.3600 కోట్లు. ఛూ మంతర్, అబ్రకదబ్రా .. ఆరోగ్య ఆసరా కింద ఆపరేషన్ పూర్తయిన తరువాత పేషెంట్ రెస్ట్ తీసుకునే సమయంలో కూడా నెలకు రూ.5 వేలు ఇచ్చి రెస్ట్ సమయంలో కూడా పేషెంట్ను ఆదుకునే కార్యక్రమం. ఆరోగ్య ఆసరా దానికి సంవత్సరానికి రూ.400 కోట్లు అవుతుంది. ఆరోగ్యశ్రీ రూ.3600 కోట్లు, ఆరోగ్య ఆసరా రూ.400 కోట్లు మొత్తం రూ.4000 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశాడు. నెట్వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. ఏ పేదవాడు కూడా నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో లేరు. కానీ, ఈ పెద్దమనిషి ఛూ మంతర్, అబ్రకదబ్రా అంటాడు.. అన్నీ చేసేశానని చెబుతాడు.. ఎవరైనా చేయలేదని ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని బెదిరిస్తాడు. ఇదే జరుగుతుంది. రైతుల పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. మీ అందరికీ కంటికి కనిపించేలా అర్థం అవుతుంది. రైతుల పరిస్థితి అధ్వాన్నం రైతులకు పెట్టుబడి సహాయం రద్దు అయిపోయింది. ఉచిత పంటల బీమా రద్దు అయిపోయింది. సీజన్ ముగిసేలోగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం రద్దు. ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేస్తూ ప్రతీ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి పూర్తిగా రద్దు అయిపోయింది. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో ఈరోజున రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. బాదుడే బాదుడు ఒక్కటైతే ఒప్పుకోవాలి.. దేనికి అనేది మనం చెప్పాలి, కొన్ని కొన్ని అయితే చేశాడు.. చెప్పకపోతే తప్పు అయిపోతది కదా.. (వ్యంగ్యంగా) రూ.15 వేల కోట్ల కరెంట్ చార్జీల బాదుడే బాదుడు చేశాడు. గవర్నమెంట్ స్కూళ్లను, కాలేజీలను చంపేసి, తద్వారా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు పెంచి ఆ బాదుడు.. బాదుడే బాదుడు.. అది కూడా చేశాడు. అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటి అద్దెల బాదుడు.. బాదుడే బాదుడు.. ఇది కూడా చేశాడు మనం ఒప్పుకోవాలి హెరిటేజ్ కోసం అమూల్ను చంపేసి పాలరేట్ల బాదుడు.. బాదుడే బాదుడు ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలు తీసేసి, రేషన్ ద్వారా సబ్సిడీకే కంది పప్పు ఇచ్చే కార్యక్రమం మానేశాడు. ఆ బాదుడు కూడా ఒప్పుకోవాలి. ఇంతకు ముందు కందిపప్పు 25 శాతం తక్కువ డిస్కౌంట్తో వచ్చేది. ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలు తీసేశాడు. ఆ రేషన్ ద్వారా అందించే పప్పులు ఆపేయడం ద్వారా పప్పుల ధరలు బాదుడే బాదుడు... ఇది కూడా చేశాడు ఒప్పుకోవాలి. ఇలా అన్ని రకాలుగా బాదుడే బాదుడు కార్యక్రమానికి మొదలుపెట్టాడు. ఉద్యోగాలు హుష్కాకి ఈ సంవత్సర కాలంలో ఏకంగా చంద్రబాబు తీసేసిన ఉద్యోగాలు 3 లక్షల పైచిలుకు.. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కథ దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలు దాదాపు 3 లక్షల పైచిలుకు పోయాయి. 2.60 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు హుష్కాకీ.. రేషన్ బండ్లు నడిపేవారు, హెల్పర్. 9200 బండ్లు.. డ్రైవర్, హెల్పర్ మరో 20 వేల ఉద్యోగాలు హుష్కాకీ.. బ్రేవరేజర్స్ కార్పొరేషన్లో పనిచేస్తున్న మరో 15 వేల మంది అవుట్ సోర్కింగ్ ఎంప్లాయీస్ హుష్కాకీ.. ఫీల్డ్ అసిస్టెంట్లు.. అన్నీ కలుపుకుంటే చంద్రబాబు వచ్చిన తరువాత 3 లక్షల పైచిలుకు ఉద్యోగాలు హుష్కాకీ. చంద్రబాబు దెబ్బకు పంటలకు ధరలు లేక రైతులు ఒకవైపున అల్లాడుతుంటే.. మరోవైపు ధరలు పెరిగి చంద్రబాబు మోసంతో జనం కిందామీదా పడుతున్నారు. ఒకవైపున ప్రజల పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే.. రెండో వైపున గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏమైనా మేలు జరిగిందా అంటే అదీ శూన్యమే. తోకలు కత్తిరిస్తా.. భూస్థాపితం చేస్తానంటాడు వస్తూనే ఐఆర్ ఇస్తానన్నాడు.. అదీ పాయే, ఉన్న పీఆర్సీని రద్దు చేశాడు. కొత్త పీఆర్సీని ఇంత వరకు జమ చేయలేదు. కొత్తగా త్వరగా వేస్తే.. అంతే త్వరగా ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుందని వాళ్లను వెన్నుపోటు పొడిచాడు. మూడు డీఏలు ఇప్పటికే పెండింగ్. జూలై 1 వస్తే నాలుగో డీఏ పెండింగ్. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో మనం ఎంప్లాయీస్కు మంచి చేస్తూ ఎన్పీఎస్ను తీసేసి గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చి మనం మంచి చేస్తే.. దాన్ని తీసి ఓపీఎస్ తీసుకువస్తాను అన్నాడు.. అక్కడ కూడా వెన్నుపోటు పొడిచాడు. దాదాపుగా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.20 వేల కోట్ల పైచిలుకు ఉన్నాయి. ఎవరైనా అడిగితే తోకలు కత్తిరిస్తా అంటాడు. భూస్థాపితం చేస్తానంటాడు. ప్రజలకు తాను ఇచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి మాత్రం. తాను, తన ఎల్లో మీడియా ఇద్దరూ కూడా రకరకాల స్కెచ్లు వేస్తారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. సంపద తన కళ్లెదుటే ఆవిరి అయిపోతుంది. సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి.. గవర్నమెంట్కు రావాల్సిన సంపద.. తన జేబుల్లోకి, తన దొంగల ముఠా జేబుల్లోకి పోతుంది. దాని వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి. సంపద సృష్టి కథ దేవుడెరుగు.. సంపద ఆవిరి కనిపిస్తోంది. స్లైడ్ 1: రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం.. మా ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర జీఎస్డీపీలో అప్పుల శాతం 4.08 అయితే.. చంద్రబాబు హయాంలో 2024-25 ఒక్క సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 5.12. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూలోటు.. రెవెన్యూ ఖర్చు కోసం అప్పుల మీద ఆధారపడే పరిస్థితి. మా హయాంలో రెవెన్యూ డెఫిసిట్ టు జీఎస్డీపీ 2.5 శాతం ఐదు సంవత్సరాలు కలిపితే.. కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్న పరిస్థితుల మధ్య మా పర్ఫామెన్స్ ఇది. చంద్రబాబు గారి ఒక్క సంవత్సర పాలన 2024-25లో 3.61 శాతం రెవెన్యూ డెఫిసిట్ టు జీఎస్డీపీ స్లైడ్ 2: రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని ఘట్టం ఇది. మా హయాంలో ఐదు సంవత్సరాలకు కలిపి మేము రూ.3,32,671 కోట్ల అప్పులు చేస్తే.. దీంట్లో రాష్ట్రానికి సంబంధించి డైరెక్ట్ గవర్నమెంట్ అప్పు.. స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీడ్ అప్పు.. లేదా పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్.. నాన్ గ్యారెంటీడ్ లయబులిటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అన్నీ కలుపుకుంటే కూడా ఆరంభంలో చంద్రబాబు ప్రభుత్వానికి రూ.1,40,711 కోట్లు వస్తే.. చంద్రబాబు దిగిపోయే సమయానికి రూ.3,90,247 కోట్లకు అది ఎగబాకితే.. మా హయాంలో రూ. 3.90 లక్షల కోట్ల నుంచి రూ.7.21లక్షల కోట్లకు పోయింది. అంటే మా ఐదు సంవత్సరాల్లో కలిపి మేము 3,32,671 కోట్లు మేము చేస్తే.. ఇక్కడ మీరు ఆలోచన చేయండి. 2024-25 ఒకే ఒక్క సంవత్సరం, 2025 ఏప్రిల్, మే కూడా కలుపుకుంటే చంద్రబాబు గారు చేసిన అప్పులు 1,61,301 కోట్ల రూపాయలు. మేము ఐదేళ్లలో చేసిన అప్పులో 48.5 శాతం ఒకే ఒక్క సంవత్సరంలో చేశాడు. 2024-25 సంవత్సరం ముగిసే నాటికి రూ.81,597 కోట్లు ఏప్రిల్, మే మాసాల్లో 22,500 కోట్లు జూన్లో చేసిన అప్పులు మరో 14 వేల కోట్లు ఎస్డీఎల్ బారోయింగ్స్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీపీఎఫ్సీ రూ.710 కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీ మార్క్ఫెడ్ రూ.6000 కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ రూ.2000 కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీఎండీసీ బాండ్స్ రూ.3,489 కోట్లు బారోయింగ్స్ సెక్యూర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమరావతి (వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ ద్వారా) రూ.15,000 కోట్లు హుడ్కో ద్వారా రూ.11,000 కోట్లు ద్వారా కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ ద్వారా మరో రూ.5000 కోట్లు బారోయింగ్స్ సెక్యూర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమరావతి రూ.31,000 కోట్లు ఇవన్నీ కలుపుకుంటే రూ.1,61,301 కోట్లు చంద్రబాబు గారు 12 నెలల కాలంలో చేసిన అప్పులు.. మేము ఐదేళ్లలో 3.32 లక్షల కోట్లు అయితే ఆయన ఒక్క సంవత్సరంలో చేసిన అప్పులు రూ.1.61 లక్షల కోట్లు. 48.5 శాతం ఎక్కువ. మా హయాంలో ఇంకా కోవిడ్ ఉన్నప్పటికీ, మా పరిస్థితి అది. ఆయన హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి లేనప్పటికీ పరిస్థితి ఇది. రాష్ట్ర ఖజానా గజదొంగల ముఠా దోపిడీ ఇక రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాల పరిస్థితి ఎలా ఉంది? అని గమనిస్తే, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాకు రావడం లేదు, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు చంద్రబాబు నాయుడు, ఆయన గజదొంగల ముఠా పంచుకుని తింటున్నారు. అది క్లియర్ గా కనిపిస్తుంది. 2024-25 సంవత్సరం చూస్తే.. రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్.. వనరులు నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కానీ, ట్యాక్స్ రెవెన్యూస్ కానీ.. 2024లో అంటే మా ప్రభుత్వంలో 93,354 కోట్లు వస్తే, చంద్రబాబు హయాంలో కేవలం 3.08 శాతం పెరుగుదల మాత్రమే నమోదు చేస్తూ 96,227 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇది వెరీ ఇంపార్టెంట్.. ఇదే సంవత్సర కాలంలో దేశం చూస్తే, దేశంలో ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ ఎంత అని చూస్తే 12.04 శాతం. అంటే దేశం మొత్తం 12.04 శాతంతో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతుంటే రాష్ట్రానికి వచ్చే సరికే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కేవలం 3 శాతం మాత్రమే లాస్ట్ ఇయర్ పెరిగింది. సంవత్సర కాలం చంద్రబాబు పరిపాలనలో. ఏప్రిల్-మే రెండు నెలలు పరిశీలిస్తే మా ప్రభుత్వ హయాంలో ఏప్రిల్-మే, ఈ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్-మే గమనిస్తే స్టేట్స్ ఓన్ రెవెన్యూ మా హయాంలో 14644 కోట్లు వస్తే, చంద్రబాబు హయాంలో అది తగ్గి 14,579 కోట్లు అంటే మైనస్ 0.44 శాతం. అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాలోకి రాకుండా చంద్రబాబు జేబులోకి, ఆయన గజదొంగల ముఠా జేబుల్లోకి పోతోందని చెప్పడానికి నిదర్శనం ఇది. అన్నింటికన్నా ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలు. తాను అబద్ధాలు ఆడుతూ తానెప్పుడూ ఏ ప్రభుత్వ ఆస్తినీ తాకట్టు పెట్టలేదని ఈ మధ్య కాలంలో చాలా గట్టిగా గంభీరంగా చెప్పాడు. (((వీడియో ప్రదర్శించి చూపించారు)) దీని అర్థం ఏంటి బాబూ? మరి ఆయన చేసింది ఏపీఎండీసీ జీవో చూడండి. ఏకంగా జీవో నంబర్ 69 డేటెడ్ 24.04.2025. పర్మిషన్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు.. ఏపీఎండీసీకి సంబంధించిన 436 మైన్స్ ప్రాజెక్టులను తాకట్టు పెడుతూ వాటి విలువ రూ.1.91 లక్షల కోట్లు చూపిస్తున్నాడు. ఏందయ్యా చంద్రబాబూ దీని అర్థం ఏంది అని అడుగుతున్నా. ఇంతటితో ఆగలేదు ఈ పెద్దమనిషి. బాండ్లు ఇష్యూ చేశాడు. ఎంత దారుణంగా ఇష్యూ చేశాడంటే.. ఏపీఎండీసీ ఇష్యూ చేసిన బాండ్లు.. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నాడు. ఎస్డీఎల్ (స్టేట్ డెవలప్మెంట్ లోన్లు సెంట్రల్ గవర్నమెంట్.. ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ కింద ఆర్బీఐ ఇస్తుంది) ప్రతి వారం ఆర్బీఐ వద్దకు స్టేట్ గవర్నమెంట్ పోతుంది. ఆ లిమిట్స్ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు. ఈ పెద్ద మనిషి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు చేసినదానికన్నా ఇంకా ఎక్కువ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేస్తున్నాడు. బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలోకి ఎప్పుడూ పోలేదు. ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఈ పెద్దమనిషి, ఇన్ని మోసాలు చేస్తూ ఈ పెద్దమనిషి ఇప్పుడు ప్రతి ఇంటికీ తన ఎమ్మెల్యేలను, తన పార్టీకి సంబంధించిన నాయకులను ఇంటింటికీ పంపిస్తాడట. ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నా.. నేను ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులు వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ల కార్యకర్తలు ఇంటికి వచ్చినప్పుడు.. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, చంద్రబాబు ఇచ్చిన బాండ్లను అందరూ కూడా రెడీగా పెట్టుకోమని అడుగుతున్నా. రెడీగా పెట్టుకుని ప్రతి ఇంటికీ ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను ఒక్కసారి చూపించండి. వారికి చూపించి ఈ సంవత్సర కాలంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎంత బాకీ ఉంది అని ఆ మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడుకు గట్టిగా ఆ నాయకుల్ని డిమాండ్ చేయాలని అడుగుతున్నా. రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు మీ అందరికీ ప్రజలందరికీ కూడా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ, అంటే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అని హెడ్డింగ్ పెట్టి.. తెలుగులో అర్థం కావాలంటే బాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అని పెట్టి క్యూఆర్ కోడ్ లో ఈ చంద్రబాబు మేనిఫెస్టోను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునే విధంగా.. ఒకవేళ ఎవరి ఇంట్లో అయినా మేనిఫెస్టో లేకపోతే, వెంటనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేస్తాం. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్లలో ప్రతి కుటుంబం కూడా వీళ్లు ఎంత బాకీ ఉన్నారో, మేనిఫెస్టో ఐటమ్స్ ను చూసిన తర్వాత, ప్రతి కుటుంబానికీ వీళ్లు ఎంత బాకీ ఉన్నారో, ఏయే ఐటమ్ వీళ్లకు వర్తిస్తుందో తెలుసుకుని చంద్రబాబును, వచ్చిన వాళ్లను నిలదీస్తూ గట్టిగా అడగండి. అప్పుడైనా కనీసం వాళ్లకు సిగ్గు వచ్చి ఈ సంవత్సర కాలంలో ఎగరగొట్టిన సొమ్మును మనకు ఏమైనా వెనక్కి ఇస్తారేమో మనమంతా ఆశిద్దాం. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన బాండ్ కూడా (వీడియోలో ప్రదర్శించారు) బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అని అందరికీ కరపత్రాలు ఇచ్చారు. ప్రతి ఇంటికీ పోయి ఎస్ఎంఎస్ పంపారు. ఓటీపీ ఇచ్చారు. మెహరాజ్ బేగం షేక్ అని ముస్లిం లేడీ.. ఈమెకు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ.. మీ నమోదు సంఖ్య ఇచ్చారు. మీ సంక్షేమ వివరాలకు వాళ్లకు సంబంధించిన వెబ్ సైటు ఇచ్చి ధన్యవాదములతో టీడీపీ అని రాశారు. పేరు మెహరాజ్ బేగం షేక్, యూనిక్ ఐడీ కోడ్, వయసు, కులం, వృత్తి, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఇద్దరు, 18 సంవత్సరాల కంటే పైబడి వయసున్న మహిళలు ఇద్దరు, నిరుద్యోగ యువతీ యువకులు సున్నా, నియోజకవర్గం రాజంపేట, ఈ స్కీములు వర్తిస్తాయని రాశారు. వర్తించబడే పథకం ఆడబిడ్డ నిధి 1500, ఏడాదికి అందే సాయం 2. అంటే 36 వేలు, తల్లికి వందనం వర్తిస్తుంది రూ.30 వేలు, అన్నదాత సుఖీభవ వర్తిచదు, యువగళం వర్తిచదు, ఏడాదికి అందే మొత్తం మీకు రూ.66 వేలు, ఐదేళ్లలో అందే మొత్తం రూ.3 లక్షలు పెట్టారు. మీ కుటుంబానికి అందించే ఇతర సంక్షేమ పథకాలు, అని మహాశక్తి, దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, జూన్ 2024 నుంచి ప్రారంభం అని రాశారు. సినిమా ఎప్పటి నుంచి ప్రారంభం అది కూడా రాశారు. మీ మద్దతు తెలపడానికి మిస్ కాల్ ఇవ్వండి అని రాశారు. ఇవి ప్రతి ఇంటికీ పంపించారు. ఓటీపీ ఇప్పించారు, మిస్డ్ కాల్ ఇప్పించారు. ఏకంగా బాండ్ ఇచ్చాడు సామీ బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ. బెనిఫిట్ డీటెయిల్స్. అభినందనలు అంట. మీరు 3 లక్షల 30 వేలు పొందేందుకు.. మీ కుటుంబం అర్హత పొందింది అని పెట్టారు. మీ కుటుంబం అర్హత పొందింది అన్నారు. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని రాశారు. తర్వాత భవిష్యత్తు గ్యారెంటీ, ఇది బాబు గ్యారెంటీ అని రాశారు. చంద్రబాబు నాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని ఏకంగా బాండ్ ఇచ్చాడు సామీ. ఓటీపీ నంబర్ ఇచ్చారు, త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానన్నాడు. అన్ని చేసి జూన్ 2024 నుంచి నమోదు అవుతుందని చెప్పాడు. అంటే మీ అందరికీ కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు ఇంత బాకీ ఉన్నాడని. ఎప్పుడిస్తావని చంద్రబాబును గట్టిగా నిలదీయండి ఇప్పుడు ప్రజలందరికీ ఒక్కటే విజ్ఙప్తి చేస్తున్నా. చంద్రబాబు ఇచ్చినవన్నీ బయటకు తీయండి. మేనిఫెస్టో మనం క్యూఆర్ కోడ్ లో పెడతాం. అది కూడా డౌన్లోడ్ చేయండి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు.. అయ్యా మీరు చంద్రబాబు నాయుడు గారు.. త్రికరణ శుద్ధితో ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఇచ్చినాడయ్యా ఈ బాండూ.. ఓటీపీ నంబర్ ఇచ్చినాడు, దానికి తోడు మాతో ఫోన్ చేయించాడు, ఎస్ఎంఎస్ ఇచ్చాడు, అన్నీ అయ్యాయి. మాకు సంవత్సరం అయిపోయింది. మా అవసరాలు చాలా ఉన్నాయి, ఇబ్బందులు పడుతున్నాము, మా ఇబ్బందులు తీరాలి, చంద్రబాబు నాయుడూ ఎప్పుడిస్తావు, అని గట్టిగా నిలదీయమని అడుగుతున్నా. వడ్డీతో సహా ఇమ్మని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబును, వాళ్ల ఎమ్మెల్యేలను నిలదీస్తే కనీసం అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారని ఆశిద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే మీ తరఫున పోరాటం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. మళ్లా ధర్నా చేద్దాం. మళ్లా కలెక్టర్లను ముట్టడించే కార్యక్రమం చేద్దాం. అందరం కలిసి గట్టిగా ధర్నా ప్లాన్ చేద్దాం. మీడియా ప్రశ్నలకు సమాధానం రిపోర్టర్ ప్రశ్న: సారు.. పల్నాడు పర్యటనపై టీడీపీ నేతల విమర్శలు.. దండయాత్ర చేశారని ఆరోపిస్తున్నారు. మీరు పర్యటనలకు వెళితే నాయకులపై కేసులు పెడుతున్నారు వైయస్ జగన్: ఆయన మా పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్.. పోలీసుల హెరాస్ మెంట్ వల్ల చనిపోయిన నేపథ్యంలో.. అతని తండ్రి ప్రైవేటు కంప్లైంట్ లాంచ్ చేసి..కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకువచ్చినా కూడా కేసు కట్టలేదు..ఆ సీఐ రాజేష్ మీద ప్రైవేట్ కంప్లైంట్ లాంచ్ చేసి కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చినా కేసు కట్టలేదు. అలాంటి ఆయన బాధతో భాగస్వామినవుతూ.. నేను మా పార్టికి సంబంధించిన మా వాళ్లకు ఇంటికి వెళ్లడం తప్పా అని అడుగుతా ఉన్నా..ఆయన పెట్టింది తన కొడుకు విగ్రహం..అది పెట్టుకున్నది ఆయన సొంత స్థలంలో.. అదీ తన ఇంటిపక్కన..అది ఆయన ఇష్టం.. ఈ విషయంలో నేను పోవడం ఏ విధంగా తప్పు అవుతుంది? అలా పోవటం తప్పన్నట్లు కర్ఫ్యూ వాతావరణం తీసుకురావడం తప్పు కాదా? అలా పోవటం తప్పన్నట్లుగా.. నేను ఏ ఇంటికైతే నేను వెళ్లానో.. ఆ ఇంటిలో ఉన్న పెద్దాయన వెంకటేశ్వర్లు మీద కేసు పెట్టడం ఎంతవరకు ధర్మం ఇది? అంటే డెమోక్రసీలో ఉన్నామా? లేదా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.. ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితులు ఎక్కడా ఉండవు..రాష్ట్రంలోనే ఉంటాయి. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు? నేను పోతాను.. కలుస్తాను.. వస్తాను.. వీళ్లకు ఏం సంబంధం? రైతుల దగ్గరకు వెళ్లాను.. కలిశాను..రైతు సమస్యలు లేవనెత్తాను.. ప్రెస్ లో అడ్రస్ చేశాను.. రైతు సమస్యలనే లేవత్తాను.. రైతు సమస్యలే చెప్పాను..ఎవరికి ఏం తప్పు జరిగింది..ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా నా ధర్మం నేను చేశాను.. నా కార్యక్రమం అడ్డుకుంది మీరు.. ఎందుకు అడ్డుకున్నారు.? నా ప్రోగ్రాంకు ఎంతమంది వస్తే ఎందుకు నీకేం బాధ.. నీ ప్రోగ్రాంకు రాలేదని నీకెందుకంత బాధ? నీ ముఖం చూడటానికి ఎవరు రావడం లేదంటే.. నువ్వు చేసిన పనులు అట్లా ఉన్నాయి. నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి.. అందరినీ మోసం చేసి అందరి ఉసురు నువ్వు పోసుకుంటా ఉన్నావ్.. కానీ మా ప్రభుత్వంలో చెప్పినమాట మేము నిలబెట్టుకున్నాము..అందరికీ మంచి చేశాం.. అందుకే అందరికీ మా పార్టీ మీద ప్రేమ ఎక్కువైంది.. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్లు వస్తే తప్పేముంది? వాళ్లు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమన్నా వారికి భోజనం పెడుతున్నావా?. వారిని చూసుకుంటున్నావా? నీకేం బాధ..? మా పార్టీ వాళ్లు..నన్ను అభిమానించేవాళ్లు..నన్ను ప్రేమించే వాళ్లు ..ప్రజలతో నేను మమేకం అవుతున్నాను. వాళ్లకు లేని బాధ నీకెందుకు బాధ? గంజాయి బ్యాచ్ ప్రతి ఒక్కరి మీద అభాండాలు వేయడం అయకు అలవాటైపోయింది.. నేను వెళ్లేవరకు రైతుల సమస్యలను ఆయన ఎందుకు ప్రస్తావించలేదు? అదే పొగాకు రైతులకు గానీ..మిర్చి రైతులకు గానీ. అదే తెనాలిలో జరిగిన ఘటనలో గానీ.. నిన్న జరిగిన ప్రైవేటు కంప్లైంట్ విషయంలో గానీ...ఇవన్నీ జన్యూన్ ప్రాబ్లమ్స్ అవునా..కాదా? ప్రతి ఒక్కరికీ జరిగిన నష్టం అవునా..కాదా? మరి ఆ సందర్భాల్లో .. వారికి జరిగిన నష్టంలో..నేను వాళ్లకు సంఘీభావం తెలుపుతూ..వాళ్లతో పాటు వారి బాధలో నేను ఏకమైనప్పుడు..నేను మమేకం అయినప్పుడు నీకేం బాధ.. నేను పాలుపంచుకునే వరకు నువ్వెందుకు స్పందించడం లేదు..నువ్వు స్పందించి ఉంటే నేను పోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా? నువ్వు స్పందించడం లేదు కాబట్టే..నేను పోవాల్సి వస్తోంది.. నువ్వుబాగా పట్టించుకుని ఉంటే సమస్య ఏముంది? పుష్ప డైలాగులు చెప్పినా తప్పేనా? గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్పా రప్పా నరికేస్తాం.. అనే పోస్టర్ గురించి ఇదేదో సినిమా డైలాగ్ అనుకుంటా సామీ.. పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ లు పెట్టినా తప్పేనా? దానికీ కేసులు పెడుతున్నారంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేమా అనేది నాకర్థం కావడం లేదు. పుష్ప డైలాగులు చెప్పినా తప్పే. గడ్డం ఇట్టన్నా తప్పే. గడ్డం అట్టన్నా తప్పే. ఏంది సామీ ఇది. ఏ ప్రపంచంలో ఉన్నాం మనం. ఇది ప్రజాస్వామ్యమేనా? ఆ పోస్టర్ పట్టుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని, అతడికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఉందని జర్నలిస్టులు చెప్పాక.. ఆ పోస్టర్ పట్టుకున్న యువకుడికి టీడీపీ సభ్యత్వం కూడా ఉందంటే, అది టీడీపీ వాళ్లే చేయించినట్టనుకోవాలా? ఒకవేళ పార్టీ మారి ఉంటే అంతకన్నా మంచి పరిణామం ఉండదు. టీడీపీ కార్యకర్త కూడా చంద్రబాబుమ మీద కోపంతో పార్టీ మారాడంటే మంచిదే కదా. మైన్స్ను తాకట్టు పెట్టి అప్పులు తేవాలని ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది అంటున్నారు. ఎప్పటిలోగా తీసుకోవాలని, అప్పు అంతా ఒక్కసారిగా తీసుకొస్తారా..? దాని గురించి వివరిస్తారా? జీవో నెంబర్ 69 ద్వారా ఆస్తులు తాకట్టు పెట్టుకునే స్వేచ్ఛను ఏపీ ప్రభుత్వం ఏపీఎండీసీకి హక్కులు కల్పించింది. ఇప్పుడు ఏపీఎండీసీ ఆ హక్కును ప్రైవేటు వ్యక్తులకు లేదా కంపెనీకి కల్పించింది. ఇప్పటికే రూ. 3,489 కోట్లు అప్పు తెచ్చారు. ఈ అప్పుకి సంబంధించి రెండు రకాల గ్యారెంటీలు ఇస్తున్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒకరమైన గ్యారెంటీ, రెండో రకం 439 మైన్లకు సంబంధించి రైట్స్ వీరికి తాకట్టు పెడుతున్నారు. ఇదంతా ఏపీఎండీసీకి హక్కులు కల్పిస్తూ గవర్నమెంట్ ఇచ్చిన జోవో. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద అధికారాన్ని తాకట్టు పెట్టడంతోపాటు సిమిలర్గా కన్సాలిడేటెడ్ ఫండ్స్ మీద ప్రైవేటు వ్యక్తులకు అజమాయిషీ ఇస్తూ వారికి తాకట్టు పెట్టాడు. ఆ బాండ్లను ఎవరైతే తీసుకుంటారో వారికి ఆ మేరకు అడిషినల్ కంఫర్ట్ ఇచ్చారు. ఇలాంటి కంఫర్ట్ ఇవ్వడం దేశంలోనే తొలిసారి. నాకేంటి సంబంధం? మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ట్యాపింగ్లో పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చారని షర్మిల చెబుతున్నారు. దానికేం సమాధానం చెబుతున్నారు? ఆ సమయంలో ఆమె క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో చేశారేమో. నిజంగా చేశారో లేదో కూడా తెలియదు. ఒకవేళ పక్క రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మ ఫొన్ ట్యాపింగ్ చేసి ఉంటే దానికి నాకేంటి సంబంధం. ఎలా చేస్తారు..? ఎప్పుడు చేస్తారో? గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అనేది ఎలా చేస్తారనేది, ఎప్పుడు చేస్తారనేది ముఖ్యమైన అంశాలు. శ్రీశైలం నుంచి నీరు నాగార్జున సాగర్కి పంపించాల్సిన అసవరం లేకపోతే రాయలసీమ ప్రాంతం మొత్తం శ్రీశైలం నీరు వాడుకోగల స్వేచ్ఛ ఉంటే ఆ నీరు పైకి పంపించాల్సిన అవసరం లేదు. కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఏదైతే నీరుపోతాయో అవి పోలవరం ఎక్సెస్ వాటర్ని మనం థ్రూ పోలవరం కెనాల్ ద్వారా ఇప్పుడు వస్తున్న నీటిని ఆ పోలవరం కెనాల్ని మరింత వెడల్పు, లేదా డీపనింగ్ చేసుకుంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నాలుగు నెలల్లోనే ఓవర్ ప్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 80 శాతం ఫ్లో 3000 టీఎంసీ ఉంటే దాన్ని స్టోరేజ్ చేసుకోలేం. ఎందుకంటే పోలవరం కెపాసిటీ 190 టీఎంసీ మాత్రమే. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నాలుగు నెలల్లోనే ఆ నీటిని తీసుకురావాలి. అందుకే పోలవరం కుడికాలువ కెపాసిటీ ఇంకొంచెం పెంచి కృష్ణా ఆయకట్టుకి సప్లిమెంట్ చేయగలిగితే అప్పుడు ఆ నీరు అక్కడ మిగులుతాయి. నాగార్జున సాగర్కి వెళ్లి శ్రీశైలం నుంచి కృష్ణా ఆయకట్టుకి నీరిచ్చే కంటే పోలవరం కెనాల్ని మరింత వెడల్పు, లేదా డీపనింగ్ చేసుకుంటే సప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ విజన్. ఇదంతా ఫేజ్ బై ఫేజ్ చేయాల్సిన పనులు. ఒకేసారి చేయడం కుదరదు. శ్రీశైలంలో మిగిల్చిన నీటిని తీసుకోని పోవాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పూర్తి చేయాలి. కెనాల్ వైడనింగ్ పనులు కూడా జరగాలి. ఆ నాలుగు నెలల్లోనే నీరు ఓవర్ ఫ్లో కావాలి. ఎక్సెస్ వాటర్ని ఆ నాలుగు నెలల్లోనే తీసుకెళ్లాలి. రిజర్వాయర్ లో నీటిని నింపుకుంటూ వెళ్లాలి. వర్షాలు పడిన నాలుగు నెలల్లోనే ఈ పనులన్నీ జరగాలి. అక్కడా ఇక్కడా కాంప్రహెన్సివ్గా పనులు జరగాలి.