సీఎం వైయస్‌ జగన్‌ను ప్రశంసించిన కేంద్రమంత్రి తోమర్‌

ఇ–క్రాపింగ్‌ విధానం అత్యంత వినూత్నం

ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌లో ఏపీ స్ఫూర్తిదాయ‌కం

తాడేపల్లి: వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో సీఎం వైయస్‌ జగన్‌ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యవసాయరంగంలో చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కేంద్రమంత్రి తోమర్‌ అన్నారు. ఇ–క్రాపింగ్‌ విధానం అత్యంత వినూత్నమైందన్నారు. ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌ స్ఫూర్తిదాయమని కొనియాడారు.  
 

Back to Top