మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
థ్యాంక్యూ సీఎం సర్..
23 Jan 2023 2:57 PM
సబ్ప్లాన్ మరో పదేళ్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్న సీఎంకు కృతజ్ఞతలు
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పొడిగింపు పట్ల వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నాయకుల హర్షం
తాడేపల్లి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్ప్లాన్ (ఉప ప్రణాళిక)ను ప్రభుత్వం మరో పదేళ్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కృష్ణా జిల్లా వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు నలుకుర్తి రమేష్, విజయవాడ నగర అధ్యక్షుడు బూదాల శ్రీనివాసరావు కలిసి సీఎం వైయస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మరో పదేళ్ల పాటు కొనసాగేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీచేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. దళిత, గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం పదేళ్ల కాలపరిమితితో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం ఈ నెల 23తో ముగియనుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సబ్ప్లాన్ను కొనసాగించేందుకు సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకోవడం ఆయనకు మాపై ఉన్న ప్రేమకు నిదర్శనమని వారు పేర్కొన్నారు.