చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అమ్మవారి ఆలయ శతజయంతి ఉత్సవాలకు రండి
16 Jun 2022 5:06 PM
సీఎం వైయస్ జగన్కు ఆహ్వానం అందజేసిన ఆలయ కమిటీ
తాడేపల్లి: శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుంటూరులోని ఆర్.అగ్రహారం శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థాన శతజయంతి ఉత్సవాలకు సీఎం వైయస్ జగన్ను ఆహ్వానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ నెల 20 నుంచి 24 వరకు శత జయంతి మహోత్సవాలు జరుగనున్నాయి. ఆహ్వానపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేసిన వారిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు మద్దాళి గిరిధర రావు (గిరి), ఆలయ కమిటీ చైర్మన్ దేవరశెట్టి సత్యనారాయణ, సభ్యులు పాల్గొన్నారు.