నేడు రాయ‌దుర్గంలో సామాజిక సాధికార యాత్ర‌

అనంత‌పురం: జగనన్న పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు, జరిగిన అభివృద్ధిని వివరించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ తలపెట్టిన మూడో విడత సామాజిక సాధికార బస్సు యాత్ర  మంగ‌ళ‌వారం నియోజకవర్గ కేంద్రమైన రాయ‌దుర్గం చేరుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో గత టీడీపీ ప్రభుత్వం పేదలకు చేసిన మోసాన్ని ఎండగట్టనున్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ కులమతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేయడంతో పాటు అన్ని సామాజిక వర్గాలకూ రాజకీయంగా ప్రాధాన్యమివ్వడాన్ని వివరించనున్నారు.

సామాజిక సాధికారత పేరుతో చేపడుతున్న బస్సు యాత్రకు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. సామాజిక చైతన్యంతో సాధికార స్వరం వినిపించనున్నారు.  మధ్యాహ్నం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ చేపట్టనున్నారు.

 ఈ యాత్ర‌లో వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా, మంత్రులు మేరుగు నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఎంపీ నందిగం సురేష్‌, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, జిల్లా నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్‌, ఎంపీలు గోరంట్ల మాధవ్‌, తలారి రంగయ్య, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, అహుడా చైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కాపు రామ‌చంద్రారెడ్డి, శంకర నారాయణ, సిద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు హాజరవుతారు.

Back to Top