సర్వేపల్లిలో 50 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

 నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీని వీడి 50 కుటుంబాలు.. వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజవర్గంలో టీడీపీ భూ స్థాపితం అయిందన్నారు. సర్వేపల్లి నియోజవర్గంలో టీడీపీ తరపున గట్టి అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు, నారా లోకేష్ టార్చిలైట్ వేసుకొని వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు.

Back to Top