వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
తెలుగు కళాకారులను ప్రోత్స హించేందుకు ప్రత్యేక కార్యాచరణ
29 Jul 2022 11:21 AM
పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ఆర్కే రోజా
అమరావతి: రాష్ట్రంలో తెలుగు కళాకారులను ప్రోత్స హించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పల్లెల్లోని కళాకారులను గుర్తించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల సేవలను వినియోగించు కోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంతోపాటు తెలుగు కళా రూపాలను పరిరక్షించనున్నట్లు ఆమె తెలిపారు. సచివాలయంలో గురువారం సాంస్కృతికశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా, రాష్ట్ర స్థాయిలో సాంస్కృతిక పోటీలను అధికారికంగా నిర్వహించి విజేతలకు సీఎం వైయస్ జగన్ సమక్షంలో అవార్డులు ప్రదానం చేస్తామన్నారు.
జిల్లాల వారీగా కళారూపాల జాబితాను సిద్ధం చేయాలని.. ఆడిటోరియాలను గుర్తించి కళారూపాల ఛాయాచిత్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్భార్గవ, సాంస్కృతిక అకాడమీల చైర్పర్సన్లు, సాంస్కృతిక శాఖ సీఈఓ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.