చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పారదర్శక పాలన అందించాలి
30 Sep 2019 6:07 PM
గ్రామ సచివాలయ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
విజయనగరం: గ్రామ సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించాలని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పుష్ప శ్రీవాణి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారన్నారు. పాదయాత్ర సమయంలో చెప్పిన విషయాలను ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నారని వివరించారు. మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అన్నింటా అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించుకున్నవారిని చంద్రబాబు కించపరిచేలా మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. పేపర్ లీక్ అంటూ అసత్య ప్రచారాలు చేపట్టారని మండిపడ్డారు.