రైతుకు అండ‌గా నిలుద్దాం..కూట‌మిని నిల‌దీద్దాం

వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ 

పార్టీ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, జేసీఎస్‌ మండల ఇంఛార్జ్‌ల‌కు ప్ర‌జా పోరాటాల‌పై స‌జ్జ‌ల దిశానిర్దేశం

తాడేప‌ల్లి:  రైతాంగానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది, వారి గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ ఉందనే మెసేజ్‌ బలంగా వెళ్ళాలి, ప్రజా సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ మనం వారికి అండగా నిలుద్దామ‌ని సూచించారు. పార్టీ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, జేసీఎస్‌ మండల ఇంఛార్జ్‌ల‌కు ప్ర‌జా పోరాటాల‌పై స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి టెలీ కాన్ఫ‌రెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.

సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే..

  • బరితెగించి వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడుదాం

  • వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులంతా రైతాంగం వెంట నడవాలి 

  • అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే నుంచే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా హామీలను వేటినీ నిలబెట్టుకోలేకపోయింది.

  • వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో చేసిన పనులను, నెలకొల్పిన వ్యవస్ధలను కూటమి ప్రభుత్వం నాశనం చేసింది. 

  • వైయస్.జగన్ మోహ‌న్‌ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాలను పూర్తిగా నాశనం చేశారు.   

  • పేదల జీవితాల్లో వెలుగులు నింపిన పథకాలను వారికి అందకుండా చేశారు. డెలివరీ మెకానిజంను కూకటివేళ్లతో పెకిలించారు. 

  • ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారు. కుట్ర పూరితంగా కేసులు నమోదు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు.

  • ఈ నేపధ్యంలో ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా స్పందించాల్సిన సమయం వచ్చింది. 

  • ఎన్ని అవాంతరాలు ఎదురైనా... ప్రజల పక్షంగా వారి తరపున నిలబడాలని పార్టీ నిర్ణయించింది.

  • రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. 

  • వీటిపై చేపట్టబోయే కార్యక్రమాలను ఇప్పటికే పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి అందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు.

  • ఇందులో భాగంగా డిసెంబరు 13, డిసెంబరు 27, జనవరి 3 వ తేదీలలో మూడు కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.

  • ఈ క్రమంలో రైతులకు సంబంధించి వారికి అండగా నిర్వహిస్తున్న కార్యక్రమం డిసెంబరు 13వ తేదీన చేపట్టాలని నిర్ణయించింది. 

  • రెండో కార్యక్రమం విద్యుత్ ఛార్జీల భారంపై డిసెంబరు 27న చేపట్టబోతున్నాం. వచ్చిన ఆరు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.17వేల కోట్ల భారం ప్రజలపై మోపింది. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... పెంచిన కరెంటు ఛార్జీలపై ర్యాలీ చేపట్టనున్నాం. 

  • అదే విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తూ జనవరి ౩వ తేదీన మూడో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. 

  • ఇప్పటికే 4 క్వార్టర్లు ఫీజు చెల్లించకపోవడంతో విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు తిరస్కరిస్తున్న నేపధ్యంలో వారికి అండగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. 

  • అందరూ ముందుకు రావాలి

  • మనం చేసిన మంచినంతా నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలు చేపడుతున్నాం.
  • మనం చేపట్టబోయే  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ గట్టిగా తీర్మానం చేసింది. 
  • పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఎలాంటి రాజీ లేకుండా గ్రామస్ధాయి వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. డిసెంబరు 13న రైతుల తరపున పోరాడుతూ,  ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షంగా వైయ‌స్ఆర్‌సీపీ ఏ స్ధాయిలోనైనా అండగా నిలబడుతుందన్న విషయం ఈ కార్యక్రమం ద్వారా చెప్పాలి. 
  • పార్టీ అంతా కలిసికట్టుగా చేపడుతున్న ఈ మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేలా అందరూ ముందుకు రావాలి. ఆయా జిల్లాల్లో చేపట్టబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రేణులు, రైతులు తరలి వచ్చేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. 
  • ఈ కార్యక్రమంలో పార్టీ కేడర్ గ్రామస్ధాయి నుంచి జిల్లా స్ధాయి వరకు వెళ్లి ర్యాలీలో పాల్గొనడంతోపాటు జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూచించారు.
  •  
Back to Top