నిరక్షరాస్యతను అధిగమించేందుకు ప్రణాళికలు 

నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌తో సీఎం వైయస్‌ జగన్‌ 

అమరావతి: నిరక్షరాస్యతను అధిగమించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌తో సీఎం వైయస్‌ జగన్‌ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో సీఎం చర్చించారు. తొలి దశలో 15 వేళ స్కూళ్లలో  9 రకాల కనీస సదుపాయాలు కల్పిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం, ఆ తరువాత సంవత్సరం నుంచి 9, 10వ తరగతుల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం నాణ్యత పెంచుతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top