ఈనెల 27న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం 

సమావేశానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్న అంశాలపై అధికారులతో సమీక్షించిన సీఎం.

 తాడేప‌ల్లి: ఈనెల 27న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జ‌రుగ‌నుంది. ఈ సమావేశానికి   ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి హాజ‌రు కానున్నారు. గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్న అంశాలపై మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారులతో సమీక్షించారు.
వికాస్‌ భారత్‌ @ 2047, ఎంఎస్‌ఎంఈలు, మౌలిక సదుపాయాలు–పెట్టబడులు, వ్యాపార వర్గాలకు సులభతరమైన విధానాలు, మహిళాసాధికారత, ఆరోగ్యం మరియు పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ధి, గతి శక్తి ఏరియా డెవలప్‌మెంట్, మరియు సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పై చర్చించనున్న నీతిఆయోగ్‌ పాలక మండలి.

  • నీతి ఆయోగ్‌ సమావేశంలో వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు, కేంద్రం నుంచి సహాయాన్ని కోరనున్న రాష్ట్రం.
  • కీలక రంగాలకు సంబంధించి కొన్ని సూచనలను కూడా చేయనున్న రాష్ట్రం.
  • నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులతో సమీక్ష సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. 
  • ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులను నీతి ఆయోగ్‌ వేదికపై వివరించనున్న రాష్ట్రం.
  • ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు–నేడు,  తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకం.. తదితర అంశాలను వివరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
  • 104 వాహనాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను వివరించనున్న రాష్ట్ర ప్రభుత్వం.
  • పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్ల్‌ మధ్య అనుసంధానం ద్వారా కార్యక్రమం ఎలా విజయవంతంగా సాగుతుందో వివరించనున్న రాష్ట్ర ప్రభుత్వం.
  • ఇదే సమయంలో అధికారులకు కీలక అదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి.
  • ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో  హైపర్‌ టెన్షన్, డయాబెటిస్, రెండూ ఉన్న వారిపైన ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.
  • వీరికి వైద్యం అందించడం, ఫాలో అప్‌ చేయడం అన్నది చాలా ముఖ్యమన్న సీఎం.
  • రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బోధనాసుపత్రులు, కొత్తగా నిర్మించనున్న బోధనాసుపత్రుల్లోనూ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించిన ల్యాబ్‌లు, కాథ్‌ ల్యాబ్స్‌ తప్పనిసరిగా పెట్టాలన్న సీఎం.
  • ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలన్న సీఎం.
  • వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య డేటా సమ్మిళితం చేసే అంశంపై సమావేశంలో చర్చ.
  • మహిళా శిశుసంక్షేమశాఖ, వైద్య–ఆరోగ్యశాఖ, విద్యాశాఖ ఈ మూడు విభాగాలు కలిసి డేటాను సమ్మిళితం చేయాలన్న సీఎం.
  • తల్లిగర్బం దాల్చి, కాన్పు పూర్తి అయిన తర్వాత శిశువుకు ఆధార్‌ నెంబరు కేటాయింపు జరిగేలా చూడాలన్న సీఎం.
  • ఆ తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి, అంగన్వాడీల్లో చేరిక, తర్వాత స్కూల్లో చేరిక వరకూ వారిని ట్రాక్‌ చేయడానికి  సులభతరం అవుతుందన్న సీఎం.
  • పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్, చదువులు తదితర అంశాలన్నింటినీ కూడా ట్రాక్‌ చేయడం కూడా సులభతరం అవుతుందన్న సీఎం.
  •  
  • మహిళా సాధికారిత కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్న రాష్ట్రం.
  • బహుళజాతి కంపెనీలతో కలిసి చేసిన చేయూత పథకాన్ని వివరించనున్న రాష్ట్రం.
  • ఆయా కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఏరకంగా పథకం ఉపయోగపడిందో, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు ఎలా తోడ్పాటు నందించిందో వివరించనున్న రాష్ట్రం. 
  • మహిళా సాధికారిత దిశలో చేయతతోపాటు, ఆసరా, సున్నా వడ్డీ రుణాల పాత్రను వివరించనున్న రాష్ట్రం.
  • దిశ కింద చేపట్టిన కార్యక్రమాలనూ వివరించనున్న రాష్ట్రం.
  • దాదాపు 30వేలకుపైగా ఇంటర్‌వెన్షన్స్‌ జరిగిన విషయాన్ని హైలెట్‌ చేయనున్న రాష్ట్రం.
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో కార్యక్రమాల వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్న సీఎం.
  • నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవలన్న సీఎం.
  • ప్రతి జిల్లాకేంద్రంలో కూడా ఒక స్కిల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్న సీఎం.
  • అదివరకే డిగ్రీలు సాధించిన వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ స్కిల్‌ సెంటర్లు ఉపయోగపడతాయన్న సీఎం.
  • నియోజకవర్గాలలో హబ్స్, జిల్లాల వారీగా సెంటర్లలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల రూపకల్పనకు ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేయాలన్న సీఎం.
  • కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఈ కోర్సులను సంబంధిత యూనివర్శిటీ ద్వారా తయారు చేయించాలన్న సీఎం.
  • స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్యక్రమాలు గతంలో అవినీతమయం అయ్యాయి: సీఎం
  • ప్రభుత్వం సొమ్మ రూ.371 కోట్లను దోచుకున్నారు : 
  • అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదు :
  • నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలి :
  • ప్రభుత్వ రంగంలో స్కిల్‌ కాలేజీలు, వీటికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో.. మంచి వ్యవస్థలు ఏర్పడతాయి:
  • నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.
  • ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని, మద్దతును నీతి ఆయోగ్‌ సమావేశంలో వివరించనున్న రాష్ట్రం. 
  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్టిమెంట్‌ రంగంలో సాధించిన ప్రగతిని వివరించనున్న రాష్ట్రం.
  • రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో కొనసాగుతున్న పనులను వివరించనున్న రాష్ట్రం.
  • 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్లతోనూ తీర ప్రాంతంలో గణనీయంగా పెరగనున్న మౌలిక సదుపాయాలు అంశాన్ని వివరించనున్న రాష్ట్రం.
  • కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులకు నిధులు పూర్తిస్థాయిలో వెచ్చించి వాటిని సంపూర్ణ వినియోగంలోకి తీసుకొచ్చిన అంశాన్ని వివరించనున్న రాష్ట్రం.
  • కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్టు  అంశాన్నీ ప్రస్తావించనున్న కేంద్రం.
  • నెల్లూరు సమీపంలోని తెట్టువద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుకుసాగాలన్న సీఎం.
  • పరిశ్రమల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్న సీఎం. 
  • వారితో నిరంతరం మాట్లాడుతూ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్న సీఎం.
  • బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలన్న సీఎం.
  •  
Back to Top