ముఖ్య‌మంత్రిని కలిసిన ఎన్‌సీసీ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో ఎన్‌సీసీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ గుర్భీర్‌పాల్‌సింగ్ తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో భేటీ అయ్యారు. ఏపీలో ఎన్‌సీసీ సేవలను మరింత విస్తరించడంతో పాటు, ప్రత్యేకంగా ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ కూడా ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రికి ఎన్‌సీసీ డీజీ వివ‌రించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి జి.వాణీ మోహన్, ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (ఏపీ, తెలంగాణ) ఎయిర్‌ కమాండర్‌ పి.మహేశ్వర్, కల్నల్‌లు  వి.వి.శ్రీనివాస్, వివేక్‌ షీల్, స్టాఫ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ రిషి రాజ్‌ సింగ్, లైసన్‌ ఆఫీసర్స్‌ వి.సత్యం, పి.శ్రీనివాసరావు క‌లిశారు.

Back to Top