46 ఏళ్ల యువకుడు దేశానికే మార్గదర్శిలా నిలుస్తున్నాడు

 వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

అమరావతి:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను 15 రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని, మొదటి సారి ముఖ్యమంత్రి అయిన 46 ఏళ్ల యువకుడు యావత్ దేశానికి మార్గదర్శిలా నిలుస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కితాబిచ్చారు.  పోలవరంలో దోచుకున్న డబ్బుతో ఎన్నికల్లో గెలవాలనుకున్నారని... అయితే, ప్రజలు తుపుక్కున ఉమ్మడంతో, నడుములు విరిగేలా నేలపై పడ్డారని ఎద్దేవా చేశారు. పోలవరం డ్యామ్ పునాదుల నుంచి అవినీతి సాక్ష్యాలు ఉబికి వస్తున్నాయని చెప్పారు. ఎవరి కాళ్లు పట్టుకుని బయటపడాలా? అని చంద్రబాబు వెతుకుతున్నారని... అసలు సినిమా ఇప్పుడే మొదలైందని అన్నారు.

అమ్మ ఒడి, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, జ్యుడీషియల్ కమిషన్, రివర్స్ టెండరింగ్, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి సాహసోపేతమైన నిర్ణయాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి తీసుకున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. 

Back to Top