పల్నాడు: మరోసారి వైయస్ఆర్సీపీ గెలవాలి.. రాష్ట్రంలో సుభిక్ష పరిపాలన కొనసాగాలి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. పల్నాడు పర్యటనలో ఉన్న ఆయన పార్టీ నాయకులతో మాట్లాడారు. మంచి చేసిన ప్రభుత్వ పనితనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.. మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.890 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.. ప్రభుత్వం నుండి నేరుగా లక్ష మందికి పైగా లబ్ధి పొందారని తెలిపారు. అణగారిన వర్గాల వారిని అభివృద్ధిలోకి తీసుకు రావాలనేదే ప్రభుత్వ ప్రయత్నం.. అగ్ర కులాలలో పేదలకు కూడా ప్రభుత్వ సాయం అందుతుంది.. ప్రతి వర్గానికి మేలు చేయాలని ప్రభుత్వం పని చేసిందన్నారు. 2019 కంటే బలంగా 2024 ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ విజయం సాధించాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గ్రామాల నుంచి ప్రజా వేదికల వరకు అణగారిన వర్గాలకు పెద్ద పీట వేశామన్నారు. 2019కు ముందు తలసరి ఆదాయం, ఇప్పటి తలసరి ఆదాయం పరిగణలోకి తీసుకోవాలన్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ అధ్వర్యంలో విద్యా వైద్యానికి పెద్ద పీట వేశాం.. భవిష్యత్ లో పోర్టులు, నూతన రోడ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.