ఎమ్మార్వోను ఇసుకలో పొర్లించి కొట్టింది బంట్రోతే  

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

 
అమ‌రావ‌తి: మహిళా ఎమ్మార్వోను ఇసుకలో పడేసి కొట్టిన ఎమ్మెల్యే కూడా బంట్రోతేనని వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బంట్రోతు వ్యాఖ్య‌ల‌పై సాయిరెడ్డి ట్వీట్ట‌ర్‌లో స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అంతా ప్రజలకు బంట్రోతులేనని బాలయ్య భలే డైలాగ్ చెప్పారని వ్యాఖ్యానించారు. . ఆశా చెల్లెళ్లను బండబూతులు తిట్టిన వ్యక్తి కూడా సేవకుడనేనని దుయ్యబట్టారు. ప్రజలను హింసించి వందలకోట్ల రూపాయలు ‘కె ట్యాక్స్’ వసూలు చేసిన వారు స్పీకర్ గా చేసిన పెద్ద బంట్రోతుసంతానమే కదా! అని వ్యాఖ్యానించారు.  

Back to Top