బీసీలకు సమన్యాయం జరగాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ఉద్దేశం

వైయస్‌ఆర్‌సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ విజయసాయిరెడ్డి

తాడేపల్లి: బీసీలకు సమన్యాయం జరగాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ఉద్దేశమని ుస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో వైయస్‌ఆర్‌సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ  సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, అప్పలరాజు, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, గుమ్మనూరు జయరాం, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకటరమణ, ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్‌ బిల్లును రాజ్యసభలో పెట్టామని పేర్కొన్నారు. జనాభా లెక్కల్లో బీసీల గణన చేయాలని పార్లమెంట్‌లో డిమాండు చేశామన్నారు. 
 

Back to Top