గుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైయస్ జగన్ పాలన
27 Dec 2022 2:44 PM
మేనిఫెస్టోలోని హామీలు మూడున్నరేళ్లలోనే 98 శాతం అమలు
'గడప గడపకు మన ప్రభుత్వం'లో ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టోలోని 98 శాతం వాగ్దానాలను మూడున్నరేళ్ల పాలనలోనే అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అని వైయస్ఆర్ సీపీ ఎంపీ తలారి రంగయ్య, ఉరవకొండ నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని విడపనకల్లు మండలం ఎన్. తిమ్మాపురం గ్రామంలో నిర్వహించిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని గడప గడపకూ వెళ్లి సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావులేకుండా అర్హత ఒక్కటే ఆధారంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివరించారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.