అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించేందుకు జగనన్న గోరుముద్ద
28 Aug 2021 5:22 PM
ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించేందుకు జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామంలో శనివారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ఎంపీ పరిశీలించారు. అనంతరం విద్యార్థుల తో కలసి భోజనం చేశారు. విద్యార్థుల కు బలవర్ధకమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో స్వయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మెనూ ను ప్రత్యేకంగా రూపొందించారన్నారు. వారం రోజులు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం పెట్టిస్తున్నారని చెప్పారు.