కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఉల్లిపాయలు కేజీ రూ.25కే అందిస్తున్నాం
10 Dec 2019 1:20 PM
దేశ వ్యాప్తంగా ఉల్లి సమస్య ఉంది
సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో ఉల్లి సమస్యను నియంత్రిస్తున్నాం
పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ
అసెంబ్లీ: రాష్ట్రంలోని 101 రైతుబజార్ల ద్వారా ఉల్లిపాయలు కేజీ రూ.25కే విక్రయాలు జరుపుతున్నామని పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మార్కెట్ ఇంట్రవెన్షన్ ఫండ్ ద్వారా అధిక ధరలకు ఉల్లిని కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా కిలో రూ.25కే అందిస్తున్నామని వివరించారు. అసెంబ్లీలో మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. యావత్ దేశం మొత్తం ఉల్లిపాయల సమస్య ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు ధరలను నియంత్రించేందుకు కృషిచేశామని చెప్పారు.
సెప్టెంబర్ నుంచి ఉల్లిధర క్రమేపీ పెరుగుతూ వస్తుందని, సెప్టెంబర్ అగ్రిమిషన్ సమీక్షలో సీఎం వైయస్ జగన్ ఉల్లి లభ్యత, ధరలపై చర్చించి.. భవిష్యత్తులో ఉల్లిధర పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారన్నారు. సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మొదటి విడతలో మార్కెట్ ఇంట్రవెన్షన్ ఫండ్ ద్వారా ఉల్లిపాయలు కేజీ రూ.25కే విక్రయాలు జరిపామన్నారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 6731 క్వింటాళ్లను కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేశామని వివరించారు. మధ్యలో కొన్ని రోజులు ఉల్లి ధరలు అదుపులోకి వచ్చినప్పటికీ నవంబర్ 14 నుంచి ఉల్లి ధరలు పెరుగుతూనే వచ్చాయని, సీఎం వైయస్ జగన్ నిర్ణయం మేరకు రాష్ట్రంలో, ఉల్లి పంట అధికంగా వచ్చే ఇతర దేశాల ప్రాంతాల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేసి నేటి వరకు సుమారు 38 వేల క్వింటాళ్ల ఉల్లిపాయలను రూ.25కే రాష్ట్రం ఉన్న101రైతు బజార్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. ఉల్లి ధరలు, సరఫరాల విషయమై ఈ రెండు మాసాల్లో మార్కెటింగ్ శాఖతో సీఎం వైయస్ జగన్ నాలుగు పర్యాయాలు సమీక్షలు జరిపారన్నారు.
డిసెంబర్ 5వ తేదీన అత్యధికమైన ధర కేజీ రూ.120 బయట మార్కెట్లలో కొనుగోలు చేసి రైతుబజార్లలో వినియోగదారులకు కేజీ రూ.25కే అందించామన్నారు. దేశం మొత్తం మీద అధిక వర్షాలు పడడం ఉల్లిపంట పూర్తిగా దెబ్బతినడం, ఈ ఏడాది ఉల్లి పంట విస్తీర్ణం తక్కువగా ఉండడంతో ఈ సమస్య ఏర్పడిందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని వి వేయడం వల్ల ఈ తరుణంలో దేశ మొత్తం మీద అనూహ్యంగా ఉల్లిధరలు పెరిగాయి.