విశాఖపట్నం:శిఖండి రాజకీయాలు మానండి చంద్రబాబూ అంటూ వైయస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సూచించారు. బుధవారం విశాఖలో వరుదు కళ్యాణి మీడియాతో ఏం మాట్లాడారంటే: – ఈ రాష్ట్రానికి జగన్గారే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిసి పనికి మాలిన వాళ్లు జగనన్న ఇంట్లో ఆడవాళ్ల గురించి మాట్లాడుతున్నారు. – ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్గారు. వైయస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ గారు. మీకు దమ్ముంటే ఆయనపై మాట్లాడండి. – రాజకీయ పోరాటం చేస్తున్నది జగన్ గారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయనపై పోరాటం చేయండి. – మీకు నిజంగా దమ్ముంటే మీ భువనేశ్వరి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు కదా.. ఆమెతో మాట్లాడించండి. – లేదంటే బ్రాహ్మణి గారితో మాట్లాడించండి. మేం ఏం సమాధానం చెప్తామో చూడండి. – భారతమ్మ గారి కాలిగోటితో కూడా సరిపోని వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు. – ఆకాశం లాంటి భారతమ్మపై బురద జల్లాలంటే అగ్నికి ఆçహుతి కావడం ఖాయం. – ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచే దింపిన నాటి నుంచి చంద్రబాబుకు ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం అలవాటు. – ఒక శిఖండిలా వెనకుండి ఆడవాళ్లను అడ్డుపెట్టి చంద్రబాబు బాణాలు వేస్తూ ఉంటాడు. – దానిలో భువనేశ్వరి, బ్రాహ్మణి, పురందేశ్వరి లాంటి వాళ్లను వాడుకుంటున్నారు. దమ్ముంటే చంద్రబాబు బొమ్మ పెట్టుకుని రండి: – జగన్గారు సాక్షి పత్రిక, ఛానల్ తనది కాదు అనలేదు. వాటిని స్థాపించిందే జగన్గారు. – నాణేనికి రెండో వైపు చూపించడానికే ఆయన వీటిని పెట్టారు. – దమ్ముగా వైయస్ఆర్ బొమ్మ పెట్టుకుని వాటిని నడుపుతున్నారు. – ప్రస్తుతం సాక్షి పత్రికను జగన్ గారు నడపడం లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత తన భార్యకు ఛైర్పర్సన్గా బాధ్యతలు అప్పజెప్పారు. – ఏబీఎన్, ఈనాడు, టీవీ5 మాత్రం ముసుగేసుకుని బాబుకు అనుకూలంగా నడుపుతున్నారు. – మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు ఫొటో పెట్టుకుని నడపండి. – అది మానేసి న్యూట్రల్ మీడియా అంటూ బిల్డప్పులెందుకు..? – చంద్రబాబు స్కాంల గురించి, దోపిడీ గురించి ఆ మీడియా ఏనాడన్నా రాసిందా? – పచ్చ మీడియాతో తనకు సంబంధం లేదు అని చంద్రబాబు, టీడీపీ నాయకులు ఎవరైనా చెప్పగలరా? – ముసుగు తొలగించండి.. నిజాయితీగా యుద్ధం చేయండి. – ఇలాంటి శిఖండి రాజకీయాలు మానండి. ఎన్టీఆర్కు వెన్నుపోటులో కత్తి అందించింది భువనేశ్వరే: – ఇలాంటి అడ్డగోలు ఆరోపణలు భారతమ్మపై చేయడం సమంజసం కాదు. – చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిస్తే ఆ వెన్నుపోటుకు కత్తి అందించింది భువనేశ్వరి. – ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో భువనేశ్వరి సారధ్యంలోని హెరిటేజ్కి లబ్ధి చేకూర్చలేదా? – హెరిటేజ్ అధినేతగా భువనేశ్వరిగారే కదా ఉన్నది.. ఆమె కోసమే ఆ స్కాం చేశారా? – ఇలాంటి అక్రమాలు ఎన్నో ఉన్నా మేం ఏనాడూ దిగజారి మాట్లాడలేదు.