శిఖండి రాజకీయాలు మానండి చంద్రబాబూ..!

వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి  

భువనేశ్వరి, పురంధేశ్వరిలను ముందు పెట్టి బాబు నీచ రాజకీయాలు

ఎన్టీఆర్ వెన్నుపోటులో బాబుకు కత్తి ఇచ్చింది భువనేశ్వరి కాదా?

దమ్ము, ధైర్యం ఉంటే వైయ‌స్ జగన్‌ గారితో పోరాడండి

టీడీపీ అధినేతపై  వరుదు కళ్యాణి ఫైర్‌

ఇంట్లో ఆడవాళ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?

భారతమ్మ కాలిగోటితో సరిపోని వ్యక్తులు ఆమెను విమర్శించడమా?

సూటిగా ప్రశ్నించిన  వరుదు కల్యాణి ఫైర్‌

నాణేనికి రెండో వైపు చూపుతున్నది సాక్షి మాత్రమే

దమ్ముగా వైయ‌స్ఆర్‌  ఫోటో పెట్టుకుని నడుపుతున్నారు

దమ్ముంటే పచ్చ మీడియా బాబు బొమ్మ పెట్టుకుని రావాలి

అది మానేసి న్యూట్రల్‌ మీడియా అంటూ బిల్డప్పులెందుకు?

ముసుగు తొలగించండి..నిజాయితీగా యుద్ధం చేయండి

ఎల్లో మీడియాకు  వరుదు కల్యాణి సవాల్‌

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కాంలో భువనేశ్వరికి మేలు చేయలేదా?

అయినా మేం ఏనాడూ దిగజారి మాట్లాడలేదు

ప్రెస్‌మీట్‌లో గుర్తు చేసిన  వరుదు కల్యాణి

విశాఖపట్నం:శిఖండి రాజకీయాలు మానండి చంద్రబాబూ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సూచించారు.  బుధ‌వారం విశాఖ‌లో వరుదు కళ్యాణి మీడియాతో ఏం మాట్లాడారంటే: 

– ఈ రాష్ట్రానికి జగన్‌గారే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిసి పనికి మాలిన వాళ్లు జగనన్న ఇంట్లో ఆడవాళ్ల గురించి మాట్లాడుతున్నారు. 
– ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌గారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు జగన్‌ గారు. మీకు దమ్ముంటే ఆయనపై మాట్లాడండి. 
– రాజకీయ పోరాటం చేస్తున్నది జగన్‌ గారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయనపై పోరాటం చేయండి. 
– మీకు నిజంగా దమ్ముంటే మీ భువనేశ్వరి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు కదా.. ఆమెతో మాట్లాడించండి. 
– లేదంటే బ్రాహ్మణి గారితో మాట్లాడించండి. మేం ఏం సమాధానం చెప్తామో చూడండి. 
– భారతమ్మ గారి కాలిగోటితో కూడా సరిపోని వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు. 
– ఆకాశం లాంటి భారతమ్మపై బురద జల్లాలంటే అగ్నికి ఆçహుతి కావడం ఖాయం. 
– ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచే దింపిన నాటి నుంచి చంద్రబాబుకు ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం అలవాటు. 
– ఒక శిఖండిలా వెనకుండి ఆడవాళ్లను అడ్డుపెట్టి చంద్రబాబు బాణాలు వేస్తూ ఉంటాడు. 
– దానిలో భువనేశ్వరి, బ్రాహ్మణి, పురందేశ్వరి లాంటి వాళ్లను వాడుకుంటున్నారు. 

దమ్ముంటే చంద్రబాబు బొమ్మ పెట్టుకుని రండి:
– జగన్‌గారు సాక్షి పత్రిక, ఛానల్‌ తనది కాదు అనలేదు. వాటిని స్థాపించిందే జగన్‌గారు. 
– నాణేనికి రెండో వైపు చూపించడానికే ఆయన వీటిని పెట్టారు. 
– దమ్ముగా  వైయ‌స్ఆర్‌ బొమ్మ పెట్టుకుని వాటిని నడుపుతున్నారు. 
– ప్రస్తుతం సాక్షి పత్రికను జగన్‌ గారు నడపడం లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత తన భార్యకు ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. 
– ఏబీఎన్, ఈనాడు, టీవీ5 మాత్రం ముసుగేసుకుని బాబుకు అనుకూలంగా నడుపుతున్నారు. 
– మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు ఫొటో పెట్టుకుని నడపండి. 
– అది మానేసి న్యూట్రల్‌ మీడియా అంటూ బిల్డప్పులెందుకు..? 
– చంద్రబాబు స్కాంల గురించి, దోపిడీ గురించి ఆ మీడియా ఏనాడన్నా రాసిందా? 
– పచ్చ మీడియాతో తనకు సంబంధం లేదు అని చంద్రబాబు, టీడీపీ నాయకులు ఎవరైనా చెప్పగలరా? 
– ముసుగు తొలగించండి.. నిజాయితీగా యుద్ధం చేయండి. 
– ఇలాంటి శిఖండి రాజకీయాలు మానండి. 

ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో కత్తి అందించింది భువనేశ్వరే:
– ఇలాంటి అడ్డగోలు ఆరోపణలు భారతమ్మపై చేయడం సమంజసం కాదు. 
– చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిస్తే ఆ వెన్నుపోటుకు కత్తి అందించింది భువనేశ్వరి. 
– ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కాంలో భువనేశ్వరి సారధ్యంలోని హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చలేదా? 
– హెరిటేజ్‌ అధినేతగా భువనేశ్వరిగారే కదా ఉన్నది.. ఆమె కోసమే ఆ స్కాం చేశారా? 
– ఇలాంటి అక్రమాలు ఎన్నో ఉన్నా మేం ఏనాడూ దిగజారి మాట్లాడలేదు.

Back to Top