విశాఖపట్నం: సాక్షిటీవీ డిబేట్లో జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను వైయస్ఆర్సీపీకి ఆపాదిస్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం వైయస్ఆర్సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హోం శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనిత అసమర్థత కారణంగా రాష్ట్రంలో ప్రతి మూడు, నాలుగు గంటలకు ఒక మహిళపై అఘాయిత్యం జరుగుతోందని మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించలేని చేతకాని హోంమంత్రి ఇతరులకు విలువలను నేర్పుతానని బీరాలు పలకడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళా హోంమంత్రిగా రాష్ట్రంలోని మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన అనితకు ఇతరులకు విలువలు నేర్పే స్థాయి, అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఇంకా ఆమె ఎమన్నారంటే... సాక్షిటీవీలో జరిగిన డీబేట్లో ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను వైయస్ఆర్సీపీ, వైయస్ జగన్ కుటుంబానికి ఆపాదిస్తూ హోంమంత్రి అనిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎల్లోమీడియాతో పాటు టీడీపీ పెంచి పోషిస్తున్న సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై సదరు జర్నలిస్ట్ క్షమాపణలు చెప్పినా, అటు వైయస్ఆర్సీపీ, ఇటు సాక్షిటీవీ కూడా ఈ వ్యాఖ్యలను సమర్థించమని, అవి సదరు జర్నలిస్ట్ వ్యక్తిగత వ్యాఖలు మాత్రమే నంటూ వివరణ కూడా ఇచ్చాయి. కానీ చంద్రబాబు, ఆయన సహచర మంత్రులు మాత్రం తనదైన నైజంతో దీనిని రాజకీయం చేసేందుకు సిద్దమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. హామీల అమలులో, మహిళా రక్షణలోనూ పూర్తిగా విఫలమయ్యారు. ఏడాది కాలంగా రాష్ట్రలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రజలకు ఎటువంటి సంక్షేమం అందడం లేదు. అమరావతిని అడ్డం పెట్టుకుని కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడం, ఇంకా లక్ష ఎకరాలు కావాలంటూ రైతులను పీడించి భూములను కాజేయడంలోనే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లు నిమగ్నమై ఉన్నారు. ప్రజల గురించి ఆలోచించడమే మానేశారు. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. దానిలో భాగంగానే జర్నలిస్ట్ కృష్ణంరాజు అన్న వ్యాఖ్యలను ఉద్దేశ పూర్వకంగా వైయస్ఆర్సీకి ఆపాదించి పెద్ద వివాదంగా మార్చే ప్రయత్నం. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పండి రాష్ట్రంలో నిత్యం మహిళలు, మైనర్లపై అఘాయిత్యాలు జరుగుతున్నా రాష్ట్ర హోంమంత్రి అనిత కనీసం స్పందించడం లేదు. కానీ వైయస్ జగన్, ఆయన కుటుంబంపై దుమ్మెత్తి పోయడంలో మాత్రం ఆమె ముందుంటారు. ఈరోజు హోమంత్రి అనిత మీడియా సమావేశం పెట్టి విలువల గురించి మాట్లాడుతున్నారు. వైయస్ భారతమ్మకు విలువలు నేర్పిస్తానంటూ ఆమె మాట్లాడిన తీరు అత్యంత ఆక్షేపణీయం. వైయస్ భారతమ్మకు విలువలు నేర్పించే స్థాయిలో హోమంత్రి అనిత లేరు. ఆ అర్హత అంతకంటే అనితకు లేదు. ఎన్నికలకు ముందు, ఆ తరువాత వైయస్ విజయమ్మ, భారతమ్మలను ఉద్దేశించి అనిత ఎటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేశారో మరిచిపోయారా? వాటికి క్షమాపణలు చెప్పిన తరువాత విలువల గురించి అనిత మాట్లాడాలి. తమ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు వైయస్ జగన్, ఆయన కుటుంబంపై దుమ్మెత్తిపోయడంతోనే మొత్తం సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇదేనా హోమంత్రి బాధ్యత? కేసులు పెడతామని ఎలా మాట్లాడుతున్నారు? ప్రతిపక్ష నాయకులపై రాజకీయ కక్షసాధింపులతో కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారింది. హోమంత్రిగా అనిత ఘోర వైఫల్యం రాష్ట్రంలో హోంమంత్రిగా ముందు మీ బాధ్యతలను చక్కగా నెరవేరిస్తే, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలు, బాలికలు భద్రంగా ఉంటారు. అనంతపురంలో ఏడు రోజుల కిందటే ఒక ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీస్ యంత్రాంగం పట్టించుకోలేదు. ఈ రోజు దారుణమైన పరిస్థితిలో ఆ విద్యార్ధిని హత్యకు గురైంది. అలాగే ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు దళిత మైనర్ బాలికపై ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నా, కనీసం ఆ బాలికకు రక్షణ కూడా కల్పించలేక పోయారు. తెలుగుదేశం వారు అయితే ఎటువంటి ఘాతుకాలు చేసినా వారిని అరెస్ట్ చేయరా? ఆ జిల్లా నుంచి ఒక మహిళా మంత్రి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైయస్ఆర్ కడప జిల్లాలో మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారు. హోంమంత్రిగా ఇటువంటి ఘటనలు జరుగుతుంటే నిద్రపోతున్నారా? ఒక చేతకాని హోంమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో డెబ్బై వేల బెల్ట్ షాప్లతో రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్గ మారింది. వాటిని నియంత్రించే సామర్థ్యం లేదు. మహిళలు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా, స్కూల్, కాలేజీ, చివరికి పని ప్రదేశాల్లో కూడా రక్షణ లేదు. వంద రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పారు. సాక్షాత్తు హోమంత్రి అనిత నివాసం ఉంటున్న విశాఖ నుంచే మాదకద్రవ్యాలు రవాణా జరుగుతున్నాయి. వాటిపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ పాలిటిక్స్ తో లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. మహిళలకు ఏం చేస్తున్నారో చేతల్లో చెప్పాలి. మద్యం, గంజాయితో కొందరు మృగాల్లా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. ఇదే ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో రోజుకు 70 నుంచి 80 కేసులు నమోదవుతున్నాయని అంగీకరించారు. అంతే ప్రతి గంటకు మూడు నాలుగు కేసులు నమోదువుతున్నాయి. వాటిపైన హోంత్రి స్పందించాల్సిన బాధ్యత లేదా? చంద్రబాబు చేయించిన సర్వేలో పోలీస్ శాఖ 18వ స్థానంలో ఉంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో హోంమంత్రి విఫలమయ్యారని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. మహిళలను మోసం చేస్తున్న చంద్రబాబును ప్రశ్నించండి మహిళలను గౌరవించడం, మహిళలు స్వావలంభన దిశగా అభివృద్ధి చెందాలని అనుక్షణం తపించే నాయకుడు వైయస్ జగన్. మహిలు సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రగతి దిశగా తన పాలనలో ప్రత్యేకంగా పదకొండు పథకాలును అమలు చేశారు. 32 లక్షల ఇళ్ళ పట్టాలు మహిళల పేరు మీద ఇచ్చారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో యాబై శాతం మహిళలకు కేటాయించారు. విద్యార్ధులను ప్రోత్సహించేందుకు వారి తల్లులకు అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేశారు. విద్యా దీవెన, వసతి దీవెనలను కూడా తల్లుల ఖాతాలకే జమ చేశారు. మహిళా రక్షణ కోసం దిశాయాప్ను తీసుకువచ్చి, దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఎందరో మహిళలు ఈ యాప్ ద్వారా రక్షణ పొందారు. ఈ రోజు ఈ విధానాలను పూర్తిగా గాలికి వదిలేశారు. చంద్రబాబు మహిళలకు అనేక హామీలు ఇచ్చారు. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో అడిగే బాధ్యత హోమంత్రికి లేదా? మహాశక్తి అనే పథకం, ఉచిత బస్సు, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు, ఇరవై లక్షల ఉద్యోగాలు ఇలా ఇచ్చిన ఏ హామీని అమలు చేశారో చెప్పాలి. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను కూడా తొలగించారు. వాలంటీర్లను నమ్మించి మోసం చేశారు, రేషన్ వాహనాలను తొలగించారు. అమరావతిలో మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం అమరావతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన యాబై వేల మంది మహిళలకు వైయస్ జగన్ ఇళ్ళ పట్టాలను ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని వైయస్ఆర్సీపీ ప్రభుత్వం నిలబెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. వారికి నిలువ నీడ లేకుండా చేసి రోడ్డున పడేసిన మీరు ఈ రోజు అమరావతి మహిళ గురించి మాట్లాడుతున్నారు. అమరావతిలో రూ.5వేలు పెన్షన్ ఇచ్చిన ఘనత వైయస్ జగన్ది. వైయస్ జగన్ మహిళలు అంటే అత్యంత గౌరవిస్తారు. వైయస్ జగన్ రామరాజ్యంను ప్రజలకు అందిస్తే, నేడు చంద్రబాబు రాక్షస పాలనను చూపిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారు.