టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
ప్రభుత్వం ఎలా నడపాలో చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం
07 May 2021 12:29 PM
ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య
వైయస్ఆర్ జిల్లా: ప్రభుత్వం ఎలా నడపాలో చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య పేర్కొన్నారు. గత ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైన చంద్రబాబును ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసిన విషయం గుర్తించుకోవాలన్నారు. చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు, మొసలి కన్నీళ్లు ప్రజలకు తెలుసు అన్నారు. కరోనాపై భయాందోళనలు కలిగించడమే చంద్రబాబు ఎజెండా అని విమర్శించారు. కరోనాకు భయపడి పక్క రాష్ట్రంలో దాక్కున్న చంద్రబాబు, ఆయన కుమారుడు ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు మానుకోవాలని హితవు పలికారు.