వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రభుత్వం ఎలా నడపాలో చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం
07 May 2021 12:29 PM
ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య
వైయస్ఆర్ జిల్లా: ప్రభుత్వం ఎలా నడపాలో చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య పేర్కొన్నారు. గత ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైన చంద్రబాబును ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసిన విషయం గుర్తించుకోవాలన్నారు. చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు, మొసలి కన్నీళ్లు ప్రజలకు తెలుసు అన్నారు. కరోనాపై భయాందోళనలు కలిగించడమే చంద్రబాబు ఎజెండా అని విమర్శించారు. కరోనాకు భయపడి పక్క రాష్ట్రంలో దాక్కున్న చంద్రబాబు, ఆయన కుమారుడు ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు మానుకోవాలని హితవు పలికారు.