ఓడించి మూలనపడేసినా బుద్ధిరాలేదా..?

చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టడం హాస్యాస్పదం

వికేంద్రీకరణను వ్యతిరేకించి ఏ ముఖం పెట్టుకొని తిరుగుతావ్‌

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

తిరుమల: ప్రజలు ఓడించి మూలనపడేసినా చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టడం హాస్యాస్పదమని ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులను ప్రజలెవరూ నమ్మరన్నారు. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..  మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఓటు వేసిన చంద్రబాబు, టీడీపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటిస్తారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు, టీడీపీ నేతలను ఆ ప్రాంత వాసులు తరిమికొట్టాలన్నారు. 

బస్సుయాత్రతో ప్రజలను చైతన్యం చేస్తానని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ చేసే ప్రతి కార్యక్రమానికి అడ్డుపడుతూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. రైతు భరోసా కింద 55 లక్షల మందికి, అమ్మఒడి పథకం ద్వారా 42 లక్షల మంది తల్లులకు, పెన్షన్‌ ద్వారా 54 లక్షల మందికి లబ్ధిచేకూర్చారని, అదే విధంగా వాహనమిత్ర, చేనేత కార్మికులకు వైయస్‌ఆర్‌ చేయూత ఇలా అనేక కార్యక్రమాలను సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం తీసుకువచ్చారని, నాడు–నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లను అభివద్ధి చేసి అన్ని వసతులతో పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే విధంగా చైతన్య యాత్రలు చేయాలనుకోవడం దురదష్టకరమని, చంద్రబాబుది నీతి మాలిన రాజకీయమన్నారు. చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. 

 

Back to Top