ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేష్కు లేదు
28 Feb 2020 5:49 PM
విశాఖలో రౌడీలు అడ్డుకున్నారని నిరూపిస్తే రాజీనామా చేస్తా
ఎమ్మెల్యే ఆర్కే రోజా
అమరావతి: ఎమ్మెల్యేగా గెలవలేని నారా లోకేష్కు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. విశాఖలో చంద్రబాబును అడ్డుకున్నది ఉత్తరాంధ్ర ప్రజలేనని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబుకు స్వాగతం పలుకుతారా అని ప్రశ్నించారు. విశాఖలో రౌడీలు అడ్డుకున్నారని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే ఆర్కే రోజా సవాలు విసిరారు. సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేష్కు లేదన్నారు. గతంలో తాను మహిళా సదస్సుకు వెళ్తే ఎయిర్ పోర్టులోనే అడ్డుకుని రోజంతా తిప్పి తిప్పి హైదరాబాద్ పంపించారని, ఆ రోజు కనిపించని రాజ్యాంగం టీడీపీ నేతలకు ఈ రోజు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక ప్రాంతానికి అన్యాయం చేస్తూ..వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే చంద్రబాబుకు ఏవిధంగా స్వాగతం పలుకుతారని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన పెద్ద మనిషికి ఆ మాత్రం కామన్సెన్స్ కూడా లేదా అని ప్రశ్నించారు.