ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
దాహర్తి తీర్చిన సీఎం వైయస్ జగన్కు ధన్యవాదములు
24 Mar 2022 12:14 PM
పత్తికొండ ఎమ్మెల్యే కే.శ్రీదేవి
అమరావతి: పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం చూపి దాహర్తి తీర్చిన సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డికి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ధన్యవాదములు తెలిపారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్లో ఆమె మాట్లాడారు. వెల్దుర్తి మండలంలో 30 ఏళ్లుగా తాగునీటి సమస్య ఉంది. ఇక్కడ కేఈ కుటుంబం, కోట్ల కుటుంబాలు అధికారంలో ఉన్నా ఈ సమస్యను పరిష్కరించలేకపోయాయి. వైయస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. వైయస్ జగన్ సీఎం అయ్యాక ఆ సమస్యను పరిష్కరించారు. కృష్ణగిరి రిజర్వాయర్ నుంచి 12 కిలోమీటర్లతో పైప్లైన్ ద్వారా నీటిని అందించి ప్రజల దాహర్తిని తీర్చారు. వెల్దుర్తి ప్రజల తరఫున దన్యవాదాలు తెలుపుతున్నాం. తుగ్గలి మండలంలో 14 చెరువులు ఉన్నాయి. వీటికి మరమ్మతులు చేయించాలని సీఎంను కోరాం. ఆయన వెంటనే స్పందించి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ చెరువు పనులు పూర్తి అయితే 5 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. వర్షకాలంలోపే చెరువు పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీదేవి కోరారు.