అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రైతులకు పెద్దపీట వేశారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎలీజా అన్నారు. గత ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం విషయంలో అన్యాయం చేసిందన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక మంది నిర్వాసితులు ఉన్నారని, వారిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖలో కూడా భారీగా అవినీతి జరిగిందన్నారు.