మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జ్యుడీషియల్ క్యాపిటల్తో రాయలసీమకు న్యాయం
20 Dec 2019 2:31 PM
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
అనంతపురం: రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కృషిచేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మూడు రాజధానులు రావాల్సిన అవసరం ఉందని అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయడం హర్షణీయమని, సీఎం ప్రతిపాదనను ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. కర్నూలులో హైకోర్టుతో రాయలసీమకు న్యాయం జరుగుతుందన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు ఆరోపణలు అర్థరహితమన్నారు. అమరావతిలో చంద్రబాబు బినామీలు, టీడీపీ నాయకులు భూములు కొన్నారని, బినామీల కోసం, టీడీపీ నేతల భూముల కోసం చంద్రబాబు రాజధానులపై అర్థపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.