తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయాలన్నీ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. దేవాదాయ శాఖలో అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించారు. సమీక్ష అనంతరం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో దేవాదాయ శాఖ చేయాల్సిన అభివృద్ధిపై సీఎం దిశానిర్దేశం చేశారని చెప్పారు. అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జీవో ఇచ్చారని, అదనంగా 25 శాతం జీతం పెంపు నిర్ణయం తీసుకున్నారన్నారు. అర్చకులకు ఇల్లు ఇచ్చే అంశం త్వరితగతిన ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. దేవాదాయ భూములు సర్వే చేసి ఆలయాలకు చెందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.