కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
సంకల్పబలాన్ని చాటాం
06 Apr 2020 10:55 AM
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్ పిలుపుతో ప్రజలంతా దీపాలు వెలిగించి రాష్ట్ర సంకల్పబలాన్ని చాటామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ఇంటింటికి ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 33వేల కుటుంబాలకు దాతలు సహకారంతో ఐదు రోజులకు సరిపడా కూరగాయల పంపిణీ చేశామన్నారు. లాక్డౌన్లో ఏ పేద కుటుంబం ఇబ్బంది పడకూడదనే సీఎం వైయస్ జగన్ ఉచితంగా బియ్యం, కిలో కందిపప్పు ఇవ్వడంతో పాటు, రూ. వెయ్యి ఆర్థికసాయం చేశారన్నారన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకూడదనే ఐదు రోజులకు సరిపడా కూరగాయలు పంపిణీ చేశామన్నారు. మరో 9 రోజుల పాటు ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు.