మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
టిడిపి.. తెలుగు దుశ్శాసనుల పార్టీగా మారింది
08 Oct 2022 7:42 PM
రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా
విజయవాడ: తెలుగు దేశం పార్టీ తెలుగు దుశ్శాసనుల పార్టీగా మారిందని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో టిడిపి నేతలే అత్యాచారాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. యువతులు, మహిళలపై టీడీపీ నేతల అరాచకాలపై చంద్రబాబు, లోకేష్ నోరు మెదపరు ఎందుకు..? అని నిలదీశారు. శనివారం రోజా విజయవాడలో మాట్లాడారు. టీడీపీ నేత వేధింపుల వల్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆడవాళ్ళని వేధించిన వాళ్ళకే టీడీపీలో పదవులు ఇస్తున్నారు. దివ్యవాణి చెప్పినట్టు మహిళల్ని వేధించినవాళ్ళకే టీడీపీలో పదవులు ఇస్తున్నారు. ప్రతిదానికి ట్వీట్స్ చేసే లోకేష్... ఇప్పుడెందుకు ట్వీట్ చెయ్యలేదు..?. ఐ-టీడీపీ అంటే.. ఈడియట్స్ టీడీపీ గా మారిందని, టీడీపీ నేతలను రాష్ట్రంలో మహిళలంతా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.