వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఈనాడు టిష్యూ పేపర్గానే పనికొస్తుంది
08 Jun 2023 2:13 PM
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
విజయవాడ: ఈనాడు పత్రిక టిష్యూ పేపర్గానే పనికొస్తుందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈనాడు తప్పుడు కథనాలను మంత్రి తీవ్రంగా ఖండించారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..పౌర సరఫరా శాఖలో సీఎం వైయస్ జగన్ అనేక మార్పులు తెచ్చారని ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థ లేకుండా చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. చంద్రబాబు పాలనలో పౌరసరఫరాల శాఖలో రూ.20 వేల కోట్లు అప్పు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు దళారీ వ్యవస్థను ప్రోత్సహించారని విమర్శించారు. ఈనాడు రామోజీ కూడా వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రూ. వేల కోట్లు డైవర్ట్ చేస్తే నోరు మెదపలేదని మండిపడ్డారు.