వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అభివృద్ధిని కనులారా చూసేందుకు ఏపీకి రండి కేటీఆర్..
29 Apr 2022 3:15 PM
కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ కౌంటర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కనులారా చూసేందుకు కేటీఆర్ను ఆహ్వానిస్తున్నానని మంత్రి జోగి రమేష్ అన్నారు. సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చి జరుగుతున్న అభివృద్ధిని చూసివెళ్తున్నారన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైయస్ జగన్ నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. జగనన్న కాలనీల పేరుతో పెద్ద ఎత్తున ఊళ్లే నిర్మాణమవుతున్నాయని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల పనితీరుపై దేశమే ఏపీ వైపు చూస్తోందన్నారు. సీఎం టు కామన్ మ్యాన్ విధానం ఏ రాష్ట్రంలోనైనా ఉందా..? అది ఏపీలో మాత్రమే సాధ్యమవుతోందని మంత్రి జోగి రమేష్ అన్నారు.