మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ కేంద్రంగా పాలన
16 Sep 2022 5:20 PM
పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
అసెంబ్లీ: వైయస్ జగన్ ప్రభుత్వ పాలసీలో ఎలాంటి మార్పు లేదని, అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ధ్యేయమని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని చెప్పారు. పరిపాలన రాజధాని విశాఖకు తరలించేందుకు త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పాలన జరుగుతుందని చెప్పారు. రాజధాని కోసం విశాఖలో ఒక సెంటు ప్రైవేట్ భూమి కూడా తీసుకోబోమని స్పష్టం చేశారు.