రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బీసీలకు అత్యధిక గౌరవం కల్పించిన సీఎం వైయస్ జగన్
19 Jun 2020 1:35 PM
మంత్రి ధర్మాన కృష్ణదాస్
అమరావతి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు అత్యంత గౌరవం కల్పించారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీసీలకు సీఎం వైయస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం మరోసారి రుజువైందన్నారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఇద్దరు బీసీలకు సీట్లు కేటాయించడం గొప్ప విషయమన్నారు. చంద్రబాబు బీసీలను ఉపయోగించుకొని గతంలో అధికారంలోకి వచ్చి మోసం చేశారన్నారు. గతంలో కేంద్ర మంత్రులుగా అవకాశం వస్తే..అప్పట్లో అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారే కానీ, బీసీలు ఆ రోజు చంద్రబాబుకు గుర్తు రాలేదన్నారు.ఇవాళ వైయస్ జగన్ బీసీలకు సమన్యాయం చేస్తూ ..సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను కూడా కేబినెట్లో స్థానం కల్పించడం సంతోషంగా ఉందన్నారు.ఇవాళ బీసీలకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించడంతో రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా గౌరవించబడ్డారన్నారు. సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో బీసీలకు సమన్యాయం జరిగిందన్నారు. అన్ని వర్గాలకు వైయస్ జగన్ ప్రాధాన్యత కల్పించారని వేనోళ్లు కొనియాడుతున్నారని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.