ఏ అంశమైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం

శాసనమండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ

శాసనమండలి: ప్రతిపక్షం అడిగే ఏ అంశమైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలిలో ప్ర‌తిప‌క్షం చేస్తున్న గందరగోళంపై మంత్రి బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ఏ అంశంపై చర్చకు సిద్ధమో శాసన మండలి చైర్మన్‌కు నోటీసు ఇస్తే.. దానిపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత ప్రభుత్వం 600 పైగా హామీలు ఇచ్చి ఏ విధంగా తుంగలో తొక్కిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ అంశాన్ని మూడున్నరేళ్లకాలంలో చిత్తశుద్ధితో నెరవేరుస్తుందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఎంత వరకు హామీలు అమలు చేసింది.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మూడున్నరేళ్ల కాలంలో మేనిఫెస్టోలోని అంశాలను ఎన్ని అమలు చేశారో చర్చించేందుకు ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 

Back to Top