కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ చేసి చూపించారు
22 Jul 2019 2:14 PM
మంత్రి అవంతి శ్రీనివాస్
అమరావతి: చాలా మంది నేతలు బీసీల గురించి మాటల్లో చెప్పారని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా చేతల్లో చేసి చూపించారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. మీడియా పాయింట్ వద్ద అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. చారిత్రాత్మక బిల్లును అడ్డుకునేందుకు ఏకంగా స్పీకర్పై దాడి చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించడం బాధాకరమన్నారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని బిల్లు తీసుకురావడం శుభపరిణామమన్నారు. ఈ బిల్లుతో లక్షాలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా..వైయస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చుతారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.