నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
ఒక్క నోటీసుతో చంద్రబాబుకు ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏముంది?
16 Mar 2021 4:57 PM
మంత్రి ఆదిమూలపు సురేష్
విజయవాడ: సీఐడీ అధికారులు ఇచ్చిన ఒక్క నోటీసుతో చంద్రబాబు ప్రాణాలకు వచ్చిన ఏముందని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. చంద్రబాబు భద్రత విషయంలో కేంద్రం కల్పించుకోవాలనడం హాస్యాస్పదమన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో ఎన్నెన్నో అక్రమాలు చేసి దళిత భూములను కొట్టేశారని మంత్రి విమర్శించారు. రాజధానిలో బినామీల పేరుతో వేల ఎకరాలు కాజేశారని ఆయన మండిపడ్డారు. ఆనాడే రాజధానిలో జరిగిన అక్రమాలపై మేం ప్రశ్నించామని తెలిపారు. రాజధాని పేరుతో మీ సొంతవారికి బూములు ఎలా కాజేశారో అందరికీ తెలుసు అన్నారు. చంద్రబాబు విచారణకు సహరిస్తే అక్రమాలన్నీ బయటకు వస్తాయన్నారు. దళిత భూములను కాజేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు.