మేమంతా సిద్ధం - 13వ రోజు  షెడ్యూల్

గుంటూరు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్ యాత్ర 13వ రోజు షెడ్యూల్‌ను పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌ల‌శీల ర‌ఘురామ్ విడుద‌ల చేశారు. శుక్రవారం(12వ తేదీ) ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల  రాత్రి బస నుంచి  బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం చుట్టుగుంట సర్కిల్, VIP రోడ్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

సభ అనంతరం తక్కెలపాడు బైపాస్,పెదకాకాని బైపాస్ , వెంగళ్ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటార‌ని తలశిల రఘురాం తెలిపారు.

Back to Top